ఫుడ్ పాయిజన్ కి గురైన జాన్వీ కపూర్... ఆసుపత్రిలో చికిత్స! కండిషన్ ఎలా ఉందంటే?

By Sambi ReddyFirst Published Jul 18, 2024, 9:06 PM IST
Highlights


హీరోయిన్ జాన్వీ కపూర్ అనారోగ్యానికి గురైంది. ఆమెకు ఆసుపత్రిలో చికిత్స జరుగుతుంది. ఈ క్రమంలో ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. తండ్రి బోనీ కపూర్ ఈ విషయాన్ని ధృవీకరించారు. 
 

జాన్వీ కపూర్ అనారోగ్యానికి గురైనట్లు సమాచారం అందుతుంది. ముంబైలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో ఆమె చికిత్స పొందుతున్నారు. వైద్య పరీక్షలు నిర్వహించిన డాక్టర్స్ జాన్వీ కపూర్ ఫుడ్ పాయిజన్ కి గురైనట్లు గుర్తించారు. ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వెల్లడించారు. ఆమె ఆరోగ్యం నిలకడగా ఉంది. శుక్రవారం ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయ్యే అవకాశం కలదట. జాన్వీ కపూర్ ఆసుపత్రిలో చేరారన్న వార్త అభిమానులను ఆందోళను గురి చేసింది. 

దీంతో జాన్వీ కపూర్ తండ్రి బోని కపూర్ స్పందించారు. ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఫుడ్ పాయిజన్ కి గురైన జాన్వీ చికిత్స తీసుకుంటుంది. కోలుకున్న వెంటనే డిశ్చార్జ్ అవుతుందని వివరణ ఇచ్చినట్లు సమాచారం. జులై 12న జాన్వీ కపూర్ ప్రియుడు శిఖర్ పహారియాతో కలిసి అనంత్ అంబానీ-రాధికా మర్చంట్ వివాహానికి హాజరయ్యారు. మరోవైపు జాన్వీ కపూర్ షూటింగ్స్ తో బిజీగా ఉంది. ఆమె లేటెస్ట్ మూవీ ఉలజ్ విడుదలకు సిద్ధం అవుతుంది. ఈ చిత్ర ప్రమోషన్స్ లో ఆమె పాల్గొంటున్నారు. 

Latest Videos

మరోవైపు దేవర షూటింగ్ పూర్తి చేసే పనిలో ఉన్నారు. దేవర జాన్వీ కపూర్ కి ఫస్ట్ తెలుగు చిత్రం. దేవర తో సౌత్ ఇండియాలో అడుగుపెడుతుంది. ఎన్టీఆర్ హీరోగా దర్శకుడు కొరటాల శివ తెరకెక్కిస్తున్న యాక్షన్ డ్రామా దేవర లో జాన్వీ కపూర్ పాత్ర కీలకంగా ఉంటుందట. ఈ విషయాన్ని కొరటాల స్వయంగా వెల్లడించాడు. దేవర రెండు భాగాలుగా విడుదల కానుంది. దేవర పార్ట్ 1 సెప్టెంబర్ 27న విడుదల కానుందట. 

దేవర విడుదల కాకుండానే మరో క్రేజీ ప్రాజెక్ట్ పట్టేసింది. ఆర్సీ 16లో రామ్ చరణ్ కి జంటగా నటిస్తుంది. పూజా కార్యక్రమాలతో ఆర్సీ 16 ఇటీవల మొదలైంది. ప్రీ ప్రొడక్షన్ జరుగుతుంది. ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సానా తెరకెక్కించనున్నాడు. ఉత్తరాంధ్ర గ్రామీణ నేపథ్యంలో ఈ మూవీ ఉంటుంది. దేవర, ఆర్సీ 16 ఫలితాలపై జాన్వీ కెరీర్ ఆధారపడి ఉంది అనడంలో సందేహం లేదు.. 

click me!