ఆర్మీ గెటప్‌లో చిరంజీవి, రామ్‌చరణ్‌.. `ఆచార్య` సెట్‌ ఫోటో‌..చూస్తే గూస్‌బమ్సే..

By Aithagoni RajuFirst Published Mar 7, 2021, 7:00 PM IST
Highlights

చిరంజీవి హీరోగా రామ్‌చరణ్‌ కీలక పాత్రలో నటిస్తున్న `ఆచార్య` చిత్ర షూటింగ్‌ ప్రస్తుతం ఖమ్మం జిల్లాలోని ఇల్లందులో జరుగుతుంది. ఆదివారం నుంచే ఈ షెడ్యూల్‌ ప్రారంభమైంది. ఇల్లందులోని జేకే కోల్‌ మైన్స్ లో ఈ సినిమాని చిత్రీకరిస్తున్నారు. ఇందులో చిరంజీవి, రామ్‌చరణ్‌లపై కీలకమైన యాక్షన్‌ సన్నివేశాలు చిత్రీకరించనున్నారు.

చిరంజీవి హీరోగా రామ్‌చరణ్‌ కీలక పాత్రలో నటిస్తున్న `ఆచార్య` చిత్ర షూటింగ్‌ ప్రస్తుతం ఖమ్మం జిల్లాలోని ఇల్లందులో జరుగుతుంది. ఆదివారం నుంచే ఈ షెడ్యూల్‌ ప్రారంభమైంది. ఇల్లందులోని జేకే కోల్‌ మైన్స్ లో ఈ సినిమాని చిత్రీకరిస్తున్నారు. ఇందులో చిరంజీవి, రామ్‌చరణ్‌లపై కీలకమైన యాక్షన్‌ సన్నివేశాలు చిత్రీకరించనున్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమా సెట్‌ నుంచి తాజాగా ఓ ఫోటో పంచుకున్నారు. సెట్‌లో షూటింగ్‌ జరుపుతుండగా తీసిన ఈ ఫోటోని చిత్ర బృందం పంచుకుంది. 

ప్రస్తుతం ఈ లుక్‌ గూస్‌బమ్స్ క్రియేట్‌ చేస్తుంది. ఇందులో చిరంజీవి, రామ్‌చరణ్‌ పాల్గొనగా, కొరటాల ముందుండి డైరెక్ట్ చేస్తున్నారు. అయితే ఈ ఫోటోలో చిరంజీవి, రామ్‌చరణ్‌ ఆర్మీ గెటప్‌లో కనిపిస్తున్నారు. కామ్రేడ్స్ గా నటించే వీరిద్దరు ఇందులో ఆర్మీ గెటప్‌లో కనిపించడం ఆశ్చర్యానికి, అనేక సందేహాలకు, సస్పెన్స్ క్రియేట్‌ చేస్తుంది. ప్రస్తుతం ఈ లుక్‌ సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తుంది. 

కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న `ఆచార్య` చిత్రంలో కాజల్‌ హీరోయిన్‌గా నటిస్తుండగా, రామ్‌చరణ్‌ `సిద్ద` అనే కామ్రేడ్‌గా, కీలక పాత్ర పోషిస్తున్నారు. మారెడుమిల్లి అటవి ప్రాంతంలో జరిగిన షెడ్యూల్‌లో చెర్రీ పాల్గొన్న విషయం తెలిసిందే. మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్‌, కొణిదెల ప్రొడక్షన్‌ కంపెనీ పతాకంపై నిరంజన్‌రెడ్డి, రామ్‌చరణ్‌ నిర్మిస్తున్నారు. ఇందులో రామ్‌చరణ్‌కి జోడిగా పూజా హెగ్డే కనిపించనున్నారు. 

click me!