'బాహుబలి'ని మించిన సినిమా అవుతుందా?

First Published Jun 4, 2018, 3:45 PM IST
Highlights

టాలీవుడ్ లో 'బాహుబలి' సినిమా వచ్చిన తరువాత భారీ బడ్జెట్ సినిమాల సంఖ్య మరింత పెరిగింది

టాలీవుడ్ లో 'బాహుబలి' సినిమా వచ్చిన తరువాత భారీ బడ్జెట్ సినిమాల సంఖ్య మరింత పెరిగింది. ఈ సినిమాలో చూపించిన యుద్ధ సన్నివేశాలు, గ్రాఫిక్స్ వర్క్ ను తెలుగు ప్రేక్షకులు మర్చిపోలేరు. అంతగా తన మేకింగ్ తో ఆకట్టుకున్నాడు రాజమౌళి. ఇప్పుడు ఈ సినిమాను మించేలా యుద్ధ సన్నివేశాలను చిత్రీకరించాలని నిర్ణయించుకుంది 'సైరా' చిత్రబృందం.

దీనికి తగ్గట్లుగా ప్లాన్ ను డిజైన్ చేసుకున్నారట. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి ఓ యాక్షన్ ఎపిసోడ్ ను చిత్రీకరించారు. దానికోసం హాలీవుడ్ కు చెందిన నిపుణుల సహాయం తీసుకున్నారు. యాక్షన్ సీన్ కు విజువల్ ఎఫెక్ట్స్ జోడించి తీసిన ఈ వార్ ఎపిసోడ్ సినిమాకు హైలైట్ గా నిలుస్తుందని అంటున్నారు. ఇక హైదరాబాద్ లో ప్రత్యేకంగా ఓ సెట్ వేసి వార్ సీన్స్ ను షూట్ చేయబోతున్నారు.

ఈ వారంలోనే దీనికి సంబంధించిన పనులు జరగబోతున్నాయి. సినిమా బడ్జెట్ లో సగం ఈ యుద్ధ సన్నివేశాల కోసమే కేటాయించినట్లు సమాచారం. మరి బహుబలికి పోటీగా చేయాలనుకుంటున్న చిత్రబృందం ఈ విషయంలో ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాలి. సురేందర్ రెడ్డి డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమాలో నయనతార, తమన్నా,  అమితాబ్ బచ్చన్ వంటి తారలు ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. వచ్చే ఏడాది వేసవి కానుకగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. 

click me!