ఇల్లందులో ల్యాండ్‌ అయిన `ఆచార్య`.. మైనింగ్‌లో యాక్షన్‌ షురూ!

By Aithagoni RajuFirst Published Mar 7, 2021, 4:39 PM IST
Highlights

మొన్నటి వరకు రాజమండ్రిలోని మారెడుమిల్లిలో బిజీగా గడిపిన చిరంజీవి ఇప్పుడు ఖమ్మంకి షిఫ్ట్ అయ్యాడు. ఖమ్మంలోని ఇల్లందులోగల జేకే కోల్‌ మైన్స్ లోకి ల్యాండ్‌ అయ్యాడు. అక్కడ వెళ్లడం వెళ్లడంతోనే బిజీగా గడుపుతున్నాడు. 

మొన్నటి వరకు రాజమండ్రిలోని మారెడుమిల్లిలో బిజీగా గడిపిన చిరంజీవి ఇప్పుడు ఖమ్మంకి షిఫ్ట్ అయ్యాడు. ఖమ్మంలోని ఇల్లందులోగల జేకే కోల్‌ మైన్స్ లోకి ల్యాండ్‌ అయ్యాడు. అక్కడ వెళ్లడం వెళ్లడంతోనే బిజీగా గడుపుతున్నాడు. ఇదంతా ఆయన హీరోగా నటిస్తున్న `ఆచార్య` చిత్ర షూటింగ్‌ కోసమని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మారెడుమిల్లి అటవి ప్రాంతంలో షెడ్యూల్‌ పూర్తి చేసుకున్న `ఆచార్య` షూటింగ్‌ ప్రస్తుతం ఇల్లందు కోల్‌ మైన్స్ లో జరుపుకుంటోంది. అందులో భాగంగా సెట్‌కి వెళ్లారు చిరంజీవి. 

అక్కడ జేకే కోల్‌ మైన్స్ అధికారులు చిరంజీవికి స్వాగతం పలికారు. ఇందులో చిరంజీవి బ్లాక్‌ కూలింగ్‌ గ్లాస్‌, తలపై హ్యాట్‌ ధరించారు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తుంది. ఇందులో పలు యాక్షన్‌ ఎపిసోడ్ చిత్రీకరించే అవకాశాలున్నాయి. ఈ షెడ్యూల్‌లో చెర్రీ కూడా పాల్గొంటాడని సమాచారం. కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న `ఆచార్య` చిత్రంలో కాజల్‌ హీరోయిన్‌గా నటిస్తుండగా, రామ్‌చరణ్‌ `సిద్ద` అనే కామ్రేడ్‌గా, కీలక పాత్ర పోషిస్తున్నారు. మారెడుమిల్లి అటవి ప్రాంతంలో జరిగిన షెడ్యూల్‌లో చెర్రీ పాల్గొన్న విషయం తెలిసిందే. మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్‌, కొణిదెల ప్రొడక్షన్‌ కంపెనీ పతాకంపై నిరంజన్‌రెడ్డి, రామ్‌చరణ్‌ నిర్మిస్తున్నారు. ఇందులో రామ్‌చరణ్‌కి జోడిగా పూజా హెగ్డే కనిపించనున్నారు. 
 

click me!