శేఖర్‌ కమ్ముల అభిమానంపై చిరంజీవి ఎమోషనల్‌ నోట్‌.. గిఫ్ట్‌ గా ఏం ఇచ్చారో తెలుసా?

Published : Jun 03, 2025, 05:05 PM IST
chiranjeevi with sekhar kammula

సారాంశం

దర్శకుడు శేఖర్‌ కమ్ముల చిత్ర పరిశ్రమలోకి వచ్చి 25ఏళ్లు పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా తన సెలబ్రేషన్‌ చిరంజీవి సమక్షంలో జరుపుకున్నారు. దీనిపై మెగాస్టార్‌ పోస్ట్ వైరల్‌ అవుతుంది.

దర్శకుడు శేఖర్‌ కమ్ముల సెన్సిబుల్‌ దర్శకుడు. మంచి హార్ట్ టచ్చింగ్‌ పాయింట్‌తోపాటు వినోదాన్ని అందించడంలో ఆయనకు ఆయనే సాటి. ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు.

సెలక్టీవ్‌గా సినిమాలు చేస్తూ మెప్పిస్తున్నారు. చివరగా `లవ్‌ స్టోరీ`తో ఆకట్టుకున్న ఆయన ఇప్పుడు `కుబేర` చిత్రంతో ఆడియెన్స్ ముందుకు రాబోతున్నారు. ఈ నెల 20న ఈ చిత్రం విడుదల కానుంది.

దర్శకుడిగా 25 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న శేఖర్‌ కమ్ముల

శేఖర్‌ కమ్ముల సినిమాల్లోకి వచ్చి 25ఏళ్లు పూర్తి చేసుకున్నారు. 2000లో `డాలర్‌ డ్రీమ్స్` అనే చిత్రంతో ఆయన దర్శకుడిగా పరిచయం అయ్యారు. ఇప్పుడు `కుబేర`తో రాబోతున్నారు. 

ఇందులో ధనుష్‌, నాగార్జున, రష్మిక మందన్నా నటిస్తున్నారు. సినిమా రిలీజ్‌కి దగ్గరపడుతున్న నేపథ్యంలో ఆయన తన 25ఏళ్ల కెరీర్‌ని సెలబ్రేట్‌ చేసుకున్నారు.

అయితే అది మెగాస్టార్‌ చిరంజీవి సమక్షంలోనే కావడం విశేషం. ఇటీవలే చిరంజీవిపై తన అభిమానం చాటుకున్నారు శేఖర్‌ కమ్ముల. తాను సినిమాల్లోకి రావడానికి ఆయనే కారణమని తెలియజేస్తూ సోషల్‌ మీడియాలో పోస్ట్ పెట్టారు.

చిరంజీవి సమక్షంలో శేఖర్‌ కమ్ముల 25ఏళ్ల జర్నీ సెలబ్రేషన్‌, ఎమోషనల్‌ నోట్‌

చిరంజీవిని కలిసి ఆయన బ్లెస్సింగ్స్ తీసుకున్నారు. తన ఫ్యాన్‌ మూమెంట్‌ని పంచుకున్నారు. ఈ సందర్భంగా శేఖర్‌ కమ్ముల చిరంజీవితో కలిసి దిగిన ఫోటోలను పంచుకుంటూ ఎమోషనల్‌ నోట్‌ని పంచుకున్నారు. ఇందులో ఆయన చెబుతూ,

 `టీనేజ్‌లో ఒక్కసారి చిరంజీవిగారిని దగ్గరగా చూశాను. ఈయనతో సినిమా తీయాలి అనే ఫీలింగ్‌ కలిగింది. అంతే నేను ఇండస్ట్రీకి వచ్చి 25 ఏళ్లు అయ్యింది. ఈ జర్నీని సెలబ్రేట్‌ చేసుకోవాలని మా టీమ్‌ అంటే నాకు గుర్తొచ్చింది చిరంజీవి గారే.

 కొన్ని జనరేషన్స్ ని ఇన్ స్పైర్‌ చేసిన పర్సనాలిటీ ఆయన. కలల వెంట పరిగెత్తు, సక్సెస్‌ మనల్ని ఫాలో అయి తీరుతుంది అన్న నమ్మకం ఇచ్చింది చిరంజీవి గారే.

నా 25ఏళ్ల జర్నీ సెలబ్రేషన్‌ అంటే ఆయన సమక్షంలోనే చేసుకోవాలి అనిపించింది. థ్యాంక్యూ సర్‌, ఈ మూమెంట్‌లోనే కాదు, నా టీనేజ్‌ నుంచి మీరు నా ముందు ఇలానే ఉన్నారు` అని పేర్కొన్నారు శేఖర్‌ కమ్ముల.

శేఖర్‌ కమ్ముల అభిమానంపై మెగాస్టార్‌ అదిరిపోయే రియాక్షన్‌

తాజాగా చిరంజీవి స్పందించారు. శేఖర్‌ కమ్ముల తనపై చూపిస్తున్న అభిమానానికి ముగ్దుడైన మెగాస్టార్‌ ఒక హార్ట్ టచ్చింగ్‌ నోట్‌ని పంచుకున్నారు. `మై డియర్‌ శేఖర్‌ కమ్ముల. మీలాంటి ఒక అభిమాని ఉండటం నాకు ఆనందకరం.

మీ ప్రస్థానానికి స్ఫూర్తినిచ్చానని తెలిసి మరింత సంతోషించాను. మీ 25ఏళ్ల జర్నీలో ఈ విధంగా నేనూ ఒక భాగమైనందుకు గర్వంగా ఉంది. సున్నితమైన వినోదంతోపాటు ఒక సోషల్‌ కామెంట్‌ని జత చేసి ఆలోచనాత్మకంగా తీసే మీ సినిమాలంటే నాకు ఎంతో ఇష్టం.

ఫిల్మ్ మేకింగ్‌లో మీకంటూ ఒక ప్రత్యేకమైన శైలిని క్రియేట్‌ చేసుకున్న మీరు ఇలానే మరో 25ఏళ్లు మరెన్నో జనరంజకమైన సినిమాలు వ్రాస్తూ, తీస్తూ, మరెన్నో ఉన్నత శిఖరాల్ని అధిరోహించాలని ఆకాంక్షిస్తూ ఆశీర్వదిస్తున్నాను` అని పేర్కొన్నారు చిరంజీవి.

 

 

శేఖర్‌ కమ్ములకి చిరంజీవి అదిరిపోయే గిఫ్ట్ 

ఈ సందర్భంగా శేఖర్‌ కమ్ములతో దిగిన ఫోటోలను పంచుకున్నారు చిరు. ఇందులో దర్శకుడు శేఖర్‌ కమ్ములుకి ఆయన ఒక రేర్‌ పెన్‌ని గిఫ్ట్ గా ఇచ్చారు. ఆ పెన్‌ బాక్స్ పై విషెస్‌ తెలియజేస్తూ నోట్‌ ని పంచుకున్నారు. ప్రస్తుతం ఆయన పోస్ట్ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. మెగా అభిమానులను ఆకట్టుకుంటుంది.

`విశ్వంభర`, అనిల్‌ రావిపూడి సినిమాలతో చిరంజీవి బిజీ

ప్రస్తుతం చిరంజీవి `విశ్వంభర` చిత్రంలో నటిస్తున్నారు. వశిష్ట దర్శకత్వంలో సోషియో ఫాంటసీగా ఈ మూవీ రూపొందుతుంది. త్రిష ఇందులో హీరోయిన్‌. వీఎఫ్‌ఎక్స్ వర్క్ కారణంగా సినిమా విడుదల డిలే అవుతుంది. గ్రాఫిక్స్ విషయంలో టీమ్‌ సంతృప్తి చెందిన తర్వాతనే మూవీ రిలీజ్‌ డేట్‌ని ప్రకటించే అవకాశం ఉంది.

దీంతోపాటు అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో ఓ మూవీ చేస్తున్నారు చిరు. ఇటీవలే ఈ చిత్రం రెగ్యూలర్‌ షూటింగ్‌ ప్రారంభమైంది. ఇందులో నయనతార హీరోయిన్‌గా నటిస్తుంది. అనిల్‌ రావిపూడి మార్క్ ఎంటర్‌టైన్‌మెంట్‌తో, `గ్యాంగ్‌ లీడర్‌`, `ఘరానా మొగుడు` స్టయిల్‌ కామెడీతో ఈ చిత్రాన్ని రూపొందించబోతున్నట్టు తెలుస్తుంది.

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Articles on
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9: రీతూ, సంజనాల డ్రామాలు కళ్లకి కట్టినట్టు చూపించిన బిగ్‌ బాస్‌.. కళ్యాణ్‌ ఫస్ట్‌ ఫైనలిస్ట్
Anasuya: నేనేమీ సాధువును కాదు.. ఇలా మాట్లాడటం నాకూ వచ్చు