మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం విశ్వంభర చిత్రంలో నటిస్తున్నారు. సూపర్ నేచురల్ ఫాంటసీ కథాంశంతో రూపొందుతున్న ఈ చిత్రాన్ని డైరెక్టర్ మల్లిడి వశిష్ట తెరకెక్కిస్తున్నారు. మరోవైపు చిరంజీవి, అనిల్ రావిపూడి కాంబినేషన్లో చిత్రం కూడా ఇటీవల ప్రారంభమైంది. త్వరలోనే షూటింగ్ కూడా మొదలవుతుంది. వీలైనంత త్వరగా విశ్వంభర చిత్రాన్ని రిలీజ్ చేయాలనే ఆలోచనలో
చిరంజీవి ఉన్నారు.
ఎందుకంటే ఈ చిత్రం చాలా రోజులుగా వాయిదా పడుతూనే ఉంది. మరోవైపు చిరంజీవి దసరా డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెలకి కూడా కమిట్మెంట్ ఇచ్చారు. నాని సమర్పణలో ఈ మూవీ రూపొందనుంది. తాజా సమాచారం మేరకు చిరంజీవి చిత్రాల లైనప్ లో మరో మూవీ చేరబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.
డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో చిరంజీవి రెండవసారి నటించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. కొంతకాలంగా వీళ్లిద్దరి కాంబినేషన్ కోసం కేవీఎన్ ప్రొడక్షన్ సంస్థ తీవ్ర ప్రయత్నాలు చేస్తుందట. ఎట్టకేలకు ఈ కాంబినేషన్ కుదిరినట్లు వార్తలు వస్తున్నాయి. చిరంజీవి ప్రస్తుతం విదేశాల్లో ఉన్నారు. లండన్ లోని మేడం టుస్సాడ్స్ లో రామ్ చరణ్ స్టాచ్యూ లాంచ్ కోసం చిరంజీవి అక్కడికి వెళ్లిన సంగతి తెలిసిందే. చిరు యూరప్ నుంచి తిరిగి రాగానే డైరెక్టర్ బాబీతో సెకండ్ కాంబినేషన్ గురించి తుది నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.
మెగా ఫ్యాన్స్ మాత్రం ఈ కాంబినేషన్ ఎలాగైనా సెట్ కావాలని భావిస్తున్నారు. గతంలో వీరిద్దరి కాంబోలో వచ్చిన వాల్తేరు వీరయ్య మూవీ చిరంజీవి కెరీర్ లోనే హైయెస్ట్ గ్రాసర్ గా నిలిచి బ్లాక్ బస్టర్ విజయం సాధించింది. డైరెక్టర్ బాబీ కూడా రీసెంట్ గా బాలయ్యతో డాకు మహారాజ్ చిత్రం రూపొందించి మరో హిట్ కొట్టాడు.