అభిమానాన్ని చూపించే టైమ్‌ వచ్చింది.. మ్యూజిక్‌ సిట్టింగ్స్ తో `చిరు153` షురూ

By Aithagoni RajuFirst Published Jun 28, 2021, 7:06 PM IST
Highlights

చిరంజీవి నెక్ట్స్ మోహన్‌రాజా దర్శకత్వంలో మలయాళ సూపర్‌ హిట్‌ `లూసిఫర్‌` రీమేక్ లో నటిస్తున్నారు. ఈ సినిమా ఇప్పటికే పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. తాజాగా మ్యూజిక్‌ సిట్టింగ్స్ ప్రారంభమయ్యాయి.

మెగాస్టార్‌ కొత్త సినిమా పనులు ఊపందుకున్నాయి. చిరంజీవి ప్రస్తుతం `ఆచార్య`లో నటిస్తున్నారు. అనంతరం మోహన్‌రాజా దర్శకత్వంలో మలయాళ సూపర్‌ హిట్‌ `లూసిఫర్‌` రీమేక్ లో నటిస్తున్నారు. ఈ సినిమా ఇప్పటికే పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. తాజాగా మ్యూజిక్‌ సిట్టింగ్స్ ప్రారంభమయ్యాయి. దర్శకుడు మోహన్‌రాజా, సంగీత దర్శకుడు ఎస్‌.ఎస్‌. థమన్‌తో కలిసి ట్యూన్స్‌ కంపోజింగ్‌తో `చిరు 153` సినిమా పనులను స్టార్ట్ చేశారు. ఈ విషయాన్ని దర్శకుడు మోహన్‌రాజా, సంగీత దర్శకుడు ఎస్.ఎస్‌.థమన్‌ ట్విట్టర్‌ ద్వారా తెలిపారు. 

`మెగాస్టార్‌ చిరంజీవిపై ఉన్న ప్రేమని చూపించే టైమ్‌ వచ్చింది. కచ్చితంగా ఇందులోని పాటలు అద్భుతంగా ఉండబోతున్నాయి` అని తమన్‌ తెలిపారు. ఈ సినిమాని ఎన్వీ ప్రసాద్‌, రామ్‌ చరణ్‌ కలిసి నిర్మిస్తున్నారు. త్వరలోనే ఇది రెగ్యూలర్‌ షూటింగ్‌ని ప్రారంభించుకోనుంది. ప్రస్తుతం చిరంజీవి `ఆచార్య`లో నటిస్తున్నారు. కొరటాలశివ దర్శకుడు. కాజల్‌ కథానాయికగా నటిస్తుంది. రామ్‌చరణ్‌ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఆయన సరసన పూజా హెగ్డే కనిపించనుంది. ఇది త్వరలోనే రిలీజ్‌కి రెడీ అవుతుంది. 

And Here We Start ❤️ with

It’s time to show love to Our beloved gaaru ⭐️⭐️⭐️⭐️⭐️

And guys this is goona be super high stuff for sure !! ❤️ pic.twitter.com/RHim4ggd7o

— thaman S (@MusicThaman)
click me!