భూవివాదంలో.. నిర్మాత సి. కళ్యాణ్‌పై కేసు నమోదు..

By Aithagoni RajuFirst Published Jun 29, 2021, 11:59 AM IST
Highlights

ప్రముఖ టాలీవుడ్‌ నిర్మాత సి. కళ్యాణ్‌పై కేసు నమోదైంది. భూవివాదం విషయంలో బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు  సి.కళ్యాణ్‌పై బంజారాహిల్స్ పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు.

ప్రముఖ టాలీవుడ్‌ నిర్మాత సి. కళ్యాణ్‌పై కేసు నమోదైంది. భూవివాదం విషయంలో బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు  సి.కళ్యాణ్‌పై బంజారాహిల్స్ పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. సి. కళ్యాణ్‌తోపాటు మరో ముగ్గురు షారూఫ్‌‌, శ్రీకాంత్‌, తేజస్వీలపై కేసు ఫైల్‌చేశారు. అమెరికాలో వైద్యుడిగా పని చేస్తున్న స్వరూప్‌, 1985లో షేక్‌పేటలో ఫిలింనగర్‌ హౌసింగ్‌ సొసైటీ నుంచి భూమి కొనుగోలు చేశాడు. 2015లో నారాయణమూర్తి అనే వ్యక్తికి లీజుకు ఇచ్చాడు. నారాయణమూర్తి ఆ స్థలంలో ఆర్గానిక్‌ స్టోర్‌ నడుపుతున్నాడు. 

అయితే సోమవారం సాయంత్రం నిర్మాత సి.కల్యాణ్‌ పంపిస్తే వచ్చామని.. షరూఫ్‌, శ్రీకాంత్‌, తేజస్వి కలిసి ఆర్గానిక్‌ స్టోర్‌కు తాళాం వేశారు. స్వరూప్‌ సోదరుడు గోపీకృష్ణ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వీరి ముగ్గురితోపాటు సి.కల్యాణ్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు పోలీసులు. గతంలోనూ నిర్మాత సి. కళ్యాణ్‌పై ఈ భూ వివాదం విషయంలో ఆరోపణలు వచ్చాయి. కొందరు పోలీస్‌ స్టేషన్‌కి కేసు కూడా పెట్టిన విషయం తెలిసిందే. సి. కళ్యాణ్‌ టాలీవుడ్‌లో బడా నిర్మాతల్లో ఒకరు. 

click me!