గుర్తుందో లేదో పదేళ్ల క్రితం ఎన్నడూ లేని విధంగా తెలుగు సినీ పరిశ్రమలో మాఫియా వివాదం తలెత్తింది.
గుర్తుందో లేదో పదేళ్ల క్రితం ఎన్నడూ లేని విధంగా తెలుగు సినీ పరిశ్రమలో మాఫియా వివాదం తలెత్తింది. మహేష్ తో ఖలేజా, పవన్ తో .. కొమరం పులి (2010) చిత్రాల నిర్మించిన సింనమల రమేష్ ఈ గొడవలో ఇరుక్కున్నారు. ఈ రెండు సినిమాలకు సి.కళ్యాణ్ ఎగ్జిక్యూటివ్ నిర్మాత . ఈ నిర్మాతలపై షాలిమర్ వీడియోస్ కంపెనీస్- యూనివర్శల్ హోమ్ ఎంటర్ టైన్ మెంట్ సంస్థలు ఓ డీల్ విషయంలో తలెత్తిన వివాదంపై సీఐడీ కోర్టు దాకా వెళ్లింది. రెండు ప్రముఖ వీడియో డిస్ట్రిబ్యూషన్ కంపెనీలతో సదరు నిర్మాతల వివాదం ఇన్నాళ్లూ నలుగుతూనే ఉంది.
నిర్మాతలు సింగనమల రమేష్ – సి.కళ్యాణ్ కలిసి భాను కిరణ్ అనే గ్యాంగ్ స్టర్ పేరుతో బెదిరింపులకు పాల్పడ్డారని.. తమని కొట్టి వేధించారని ప్రముఖ ఆడియో-వీడియో కంపెనీలు షాలిమర్ .. యూనివర్శల్ హోమ్స్ ఆరోపించాయి. ఆ మేరకు సీఐడీ కోర్టుల పరిధిలో కేసును విచారించారు తాజాగా కోర్టులో తీర్పు వెలువడింది. ఈ కేసు నుంచి సింగనమల – సి.కళ్యాణ్ ఇద్దరికీ విముక్తి లభించింది.
ఆఖరి విచారణలో ఈ నిర్మాతలపై చేసిన ఆరోపణలకు సంబంధించిన సాక్షాధారాల్ని ఇవ్వడంలో డీవీడీ-వీసీడీ కంపెనీలు విఫలమయ్యాయని జడ్జీలు తీరపును వెలువరిస్తూ .. ఈ కేసును కొట్టివేశారు. భానుకిరణ్ సమక్షంలో సి.కళ్యాణ్ తమని కొట్టారు అన్నదానికి షాలిమర్ – యూనివర్శల్ కంపెనీలు ఏమాత్రం ఆధారాల్ని చూపెట్టలేకపోయాయని కోర్టు తీర్పు లో న్యాయమూర్తులు ప్రకటించారు.
అప్పటి గొడవేంటి?
2010లో రిలీజైన కొమరం పులి, ఖలేజా సినిమాల భాక్సాఫీస్ వద్ద వర్కవుట్ కాలేదు. ఈ రెండు సినిమాలకు సంబంధించిన డీవీడీ-వీసీడీ హక్కుల క్రయవిక్రయాల్లో సదరు డీవీడీ -వీసీడీ కంపెనీలతో నిర్మాతలకు గొడవ వచ్చింది. ఖలేజా, కొమరం పులి సినిమాలకు సబంధించి డీవీడీ- వీసీడీ రైట్స్ ని ఒక్కొక్కటి 52.50 లక్షలు చొప్పున షాలిమర్ ..యూనివర్శల్ హోమ్స్ సంస్థలు కొనుగోలు చేశాయి. ఆ మేరకు చెక్కులు చెల్లించాల్సి ఉండగా వివాదం తలెత్తింది. దాంతో సింగనమల- సికల్యాణ్ బృందం గ్యాంగ్ స్టర్ పేరుతో వేధించారని సీఐడీ కోర్టులో కేసు వేశారు. మొత్తానికి ఈ కేసు ఈరోజు తో వీగిపోయింది. పదేళ్లకు ఆ ఇద్దరు నిర్మాతలకు క్లీన్ చిట్ వచ్చింది.