
ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా తో చెట్టాపట్టాలువేసుకుని తిరుగుతుంది.. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ పరిణీతి చోప్రా. డిన్నర్ డేట్ కు వెళ్ళి మరోసారి ఇద్దరు హాట్ టాపిక్ అయ్యారు. ఈ జంట ఇప్పుడు మరోసారి వార్తల్లో నిలిచారు. వీరిద్దరూ ప్రస్తుతం ప్రేమలో ఉన్నారని, త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారంటూ గత కొన్ని రోజులుగా వార్తలు వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. అయితే వార్తలు వస్తూనే ఉంటాయి.. చేసేపనులు చ్తూనే ఉంటారు.తాజాగా వీరిద్దరి పెళ్లి వార్తలు మరోసారి హాట్ టాపిక్ అయ్యారు.
ఈ ఇద్దరు మరోసారి జంటగా కనిపించారు. ఆదివారం రాత్రి ఈ ప్రేమ జంట ముంబై లో డిన్నర్ డేట్ కు వెళ్లారు. వీరిని చూసిన మీడియా, అభిమానులు.. పెళ్లి గురించి ప్రశ్నించారు. అయితే, అందుకు ఇద్దరూ సమాధానం చెప్పకుండా అక్కడి నుంచి నవ్వుతూ వెళ్లిపోయారు. రెస్టారెంట్ నుంచి ఇద్దరూ కలిసి బయటకు వస్తున్న ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
కాగా, గతకొంతకాలంగా వీరిద్దరూ కలిసి వరుసగా డిన్నర్ డేట్స్ ,లంచ్ మీటింగ్స్ , అంటూ చట్టాపట్టాలేసుకు తిరుగుతున్నారు. అంతేకాకుండా ముంబైలో జరిగిన పలు కార్యక్రమాలకు కూడా జంటగా హాజరయ్యారు. దీంతో వీరిద్దరూ ప్రేమలో ఉన్నారని తర్వలో పెళ్లి చేసుకోబోతున్నారంటూ బాలీవుడ్ మీడియాలో వార్తలు చక్కర్లు కొట్టాయి. మొదటి నుంచి స్నేహితులైన వీరు.. తమ స్నేహాన్ని ప్రేమగామలుచుకుని.. త్వరలో పెళ్లి బంధంతో ఒక్కటి కాబోతున్నట్టు తెలుస్తోంది. ఇక వీరు చెట్టా పట్టాలువేసుకుని తిరుగుతూ.. తరచూ మీడియా కెమెరాలకు చిక్కుతున్నారు. రెస్టారెంట్లకు, డిన్నర్ డేట్లకు వెళ్తూ.. కెమెరాల కళ్లల్లో పడుతున్నారు. కాని వీరి బంధం గురించి మాత్రం ఎక్కడా క్లారిటీ ఇవ్వలేదు స్టార్స్.
అయితే వీరిపెళ్లికి సన్నాహాలు జరుగుతున్నట్టు మాత్రం న్యూస్ వైరల్ అవుతోంది. ఈనెల 13న నిశ్చితార్థం చేసుకుని.. ఈ ఏడాది అక్టోబర్ లో పెళ్ళి చేసేందుకు పెద్దలు నిర్ణయించారని సమాచారం. ఇక ఇప్పటికే కలిసి చెట్టాపట్టాలు వేసుకుని తిరుగుతున్న ఈ జంట.. తాజాగామరోసారి సందడి చేశారు. ఐపీఎల్ మ్యాచ్ లో.. ఈసెలబ్రిటీ జంట హడావిడి చేశారు. ఈ భామ హిందీలో ఛమ్కీలా, క్యాప్య్సుల్ గిల్ చిత్రాల్లో నటిస్తోంది. ఇక రాఘవ్ చద్దా ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) తరపున రాజ్యసభ సభ్యుడిగా కొనసాగుతున్నారు.