అప్పట్లో సూపర్ స్టార్ ఇప్పుడు పాన్ ఇండియా స్టార్... ఎన్టీఆర్ పై బాలీవుడ్ బ్యూటీ ప్రశంసలు!

By Sambi ReddyFirst Published Sep 18, 2022, 5:24 PM IST
Highlights

ఎన్టీఆర్ పై బాలీవుడ్ బ్యూటీ అమీషా పటేల్ ప్రసంసలు కురిపించింది. సోషల్ మీడియా వేదికగా ఆయనతో ఓ రొమాంటిక్ పిక్ షేర్ చేసిన అమీషా.. అప్పట్లో సూపర్ స్టార్, ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ అంటూ పొగడ్తల్లో ముంచెత్తారు. 
 

త్రో బ్యాక్ వీకెండ్ అంటూ ఎన్టీఆర్ తో కూడిన రొమాంటిక్ ఫోటో షేర్ చేసింది అమీషా పటేల్. సదరు ఫోటోకి ఆమె పెట్టిన కామెంట్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ని ఫిదా చేస్తుంది. 2005లో బి. గోపాల్ దర్శకత్వంలో నరసింహుడు మూవీ విడుదలైంది. యాక్షన్ రివేంజ్ డ్రామాగా తెరకెక్కిన నరసింహుడు అనుకున్న స్థాయిలో విజయం సాధించలేదు. అమీషా పటేల్, సమీరా రెడ్డి హీరోయిన్స్ గా నటించారు. అమీషా ఈ మూవీలో పల్లెటూరి అమ్మాయి పాత్రలో మెప్పించారు. 

ఆ చిత్రంలోని రొమాంటిక్ ఫోటో షేర్ చేసిన అమీషా పటేల్... ''ఎన్టీఆర్ తో క్యూట్ త్రో బ్యాక్ ఫోటో. అప్పట్లో ఆయన సూపర్ స్టార్. ఇప్పుడు ఆర్ ఆర్ ఆర్ మూవీతో పాన్ ఇండియా స్టార్ గా దేశవ్యాప్తంగా ప్రేమను సంపాదించడం నాకు సొంతోషాన్ని కలిగిస్తుంది. ఆయన లవ్లీ కో స్టార్. చాలా ఒదిగి ఉండే హార్డ్ వర్కింగ్ స్టార్...'' అని కామెంట్ పెట్టారు. ఎన్టీఆర్ పట్ల అమీషా పటేల్ స్పందించిన తీరుకు ఆయన ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 

THROWBACK WEEKEND.. a cute pik from my Telugu film w/ junior NTR .. he was a huge TELUGU SUPERSTAR then as well n today seeing him getting such PAN INDIA love with the film RRR makes me soo happy .. lovely co star .. hardworking and humble 💖💖👍🏻👍🏻💯 pic.twitter.com/sCcfrmVvis

— ameesha patel (@ameesha_patel)

తెలుగులో అమీషా పటేల్, బద్రి, నరసింహుడు, నాని, పరమవీర చక్ర చిత్రాల్లో నటించారు. బద్రి మినహాయిస్తే ఆమె నటించిన చిత్రాలన్నీ ప్లాప్ అయ్యాయి. దీంతో అమీషా పటేల్ తెలుగు పరిశ్రమకు దూరం అయ్యారు. బాలీవుడ్ లో కూడా ఆమెకు చెప్పుకోదగ్గ బ్రేక్ రాలేదు. మంచి ఆరంభం లభించినా నిలబెట్టుకోలేకపోయారు. ఇక సోషల్ మీడియాలో ఆమె ఫుల్ యాక్టీవ్. హాట్ హాట్ వీడియోలు, ఫోటోలు షేర్ చేస్తూ ఉంటారు. 
 

click me!