నాగార్జున పొలంలో మృతదేహం.. కుళ్లిపోయిన స్టేజ్‌లో!

Published : Sep 19, 2019, 08:16 AM ISTUpdated : Sep 19, 2019, 08:29 AM IST
నాగార్జున పొలంలో మృతదేహం.. కుళ్లిపోయిన స్టేజ్‌లో!

సారాంశం

40 ఎకరాల క్షేత్రంలో సేంద్రీయ పంటలు పండించేందుకు చేస్తున్న ఏర్పాట్లలో భాగంగా  సేంద్రియ పంటలు పండించేందుకు ఏర్పాట్లు చేసుకున్న నాగార్జున.. 

హీరో అక్కినేని నాగార్జునకు చెందిన పొలం దగ్గర గుర్తుతెలియని మృతదేహం  బయటపడింది. రంగారెడ్డి జిల్లా షాద్నగర్ మండలం పాపిరెడ్డి గూడలో ఆయన వ్యవసాయ క్షేత్రంలోని ఓ గదిలో కుల్లిపోయిన మృతదేహం కనిపించడం కలకలం రేపింది. పొలంలో ఉన్న ఓ గదిలో కుళ్లిపోయిన డెడ్ బాడీని గుర్తించి వాళ్లు పోలీసులకు చెప్పారు.ఆ మృతదేహం పూర్తిగా కుళ్లిపోయి.. ఎముకల గూడులా ఉంది.

40 ఎకరాల క్షేత్రంలో సేంద్రీయ పంటలు పండించేందుకు చేస్తున్న ఏర్పాట్లలో భాగంగా  సేంద్రియ పంటలు పండించేందుకు ఏర్పాట్లు చేసుకున్న నాగార్జున.. ఈ విషయంపై నిపుణులను అక్కడకు పంపారు. అయితే పొలంలోకి వెళ్లిన తర్వాత ఓ ప్రాంతంలోని గదిలో కుళ్లిపోయిన ఈ మృతదేహాన్ని వారు గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. దీంతో అక్కడకు వెళ్లిన పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని.. అక్కడే పోస్టుమార్టమ్ నిర్వహించాలని నిర్ణయించుకున్నారు. అలాగే ఆ శవం దొరికిన గదిని సీజ్ చేశారు. 

ఇక  ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. అసలు చనిపోయిన వ్యక్తి ఎవరు..? ఎప్పుడు మరణించాడు..? ఎవరు చంపారు..? లేక ఆత్మహత్యా లేక సహజమరణమా అన్న కోణంలో దర్యాప్తును ప్రారంభించారు. అయితే ఈ విషయంపై ఇంకా నాగార్జున స్పందించలేదు. 

 

PREV
click me!

Recommended Stories

3800 కోట్ల బాక్సాఫీస్ కలెక్షన్లు, త్రిష,నయనతార, సమంతలకు కూడా సాధ్యం కాని రికార్డు ఆ హీరోయిన్ సొంతం..
Klin Kaara Konidela: క్లింకార ఫేస్ రివిల్ చేసిన రామ్ చరణ్, ఉపాసన.. ఎవరిపోలికలు ఎక్కువగా ఉన్నాయంటే?