తుదిదశకు చేరిన బి.జయ “వైశాఖం” మూవీ

Published : Oct 24, 2016, 01:41 PM ISTUpdated : Mar 25, 2018, 11:46 PM IST
తుదిదశకు చేరిన బి.జయ “వైశాఖం” మూవీ

సారాంశం

తెలుగు సినీ పరిశ్రమలో తనదైన శైలి సినిమాలతో ప్రత్యేకతను సంపాదించుకున్న దర్శకురాలు బి.జయ. మంచి ప్రేమ కథా చిత్రాలతో ఎక్కువగా నూతన నటీనటులను పరిచయం చేస్తుంటారు జయ. తాజాగా హరీష్, అవంతిక జంటగా వైశాఖం అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఆర్.జె సినిమాస్ పతాకంపై బి.ఎ.రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ మూవీ చిత్రీకరణ తుదిదశకు చేరుకుంది.

         సాయికుమార్ ఈ సినిమాలో ఫైర్‌మెన్ పాత్రలో నటిస్తున్నారు. ఉమ్మడి కుటుంబాలు విచ్ఛిన్నం కావటానికి కారణాల్ని చూపే ఈచిత్రం ప్రేక్షకుల మనసును కదిలించేలా ఉంటుందని సాయికుమార్ తెలిపారు. ఇక దర్శకుడు శంకర్ తర్వాత బాడీగిమ్మెల్ అనే కెమెరా టెక్నిక్‌ను ఈ సినిమాలోనే ఉపయోగించామని దర్శకురాలు జయ తెలిపారు. చిన్న సినిమాల్లో ఇది కాస్త పెద్ద బడ్జెట్ సినిమా అని, ఈ మూవీ కొత్త ట్రెండ్‌కు నాంది పలుకుతుందని హరీష్ చెప్పారు. ఈ కార్యక్రమంలో శేఖర్ మాస్టర్, మురళి, వాలిశెట్టి వెంకట సుబ్బారావు, కాశీవిశ్వనాథ్, వసంత్ తదితరులు పాల్గొన్నారు.

PREV
click me!

Recommended Stories

Rajasekhar: బాలయ్య కోసం కెరీర్‌ని రిస్క్ లో పెడుతున్న రాజశేఖర్‌.. లైఫ్‌లో మొదటిసారి డేరింగ్‌ స్టెప్‌
Bharathiraja Awards: పద్మశ్రీ నుంచి 6 నేషనల్ అవార్డుల దాకా... భారతీరాజా సాధించిన ఘనతలు!