బిగ్ బాస్2: తనీష్, దీప్తి కెప్టెన్ గా గెలిచేదెవరు..?

Published : Aug 10, 2018, 06:11 PM ISTUpdated : Sep 09, 2018, 01:58 PM IST
బిగ్ బాస్2: తనీష్, దీప్తి కెప్టెన్ గా గెలిచేదెవరు..?

సారాంశం

ఒకరిపై ఒకరు పడిపోయి మరీ గోడకి రంగుని అద్దుతున్నారు. మరి ఈ పోటీలో ఎవరు విజేతగా నిలుస్తారో ఈరోజు ఎపిసోడ్ లో తేలనుంది. సోషల్ మీడియాలో మాత్రం దీప్తి సునయన.. తనీష్ నే ఎంపిక చేస్తుందనే కామెంట్స్ ఎక్కువగా వినిపిస్తున్నాయి

బిగ్ బాస్ సీజన్ ఇప్పటికే 60 ఎపిసోడ్లను పూర్తి చేసుకుంది. ప్రతివారంలానే ఈ వారం కూడా కెప్టెన్సీ టాస్క్ కోసం పోటీ జరుగుతోంది. 'అంతిమయుద్ధం' టాస్క్ లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన దీప్తి, తనీష్ లను కెప్టెన్సీ టాస్క్ లో పాల్గొనమని 'రంగు రబ్బా.. రబ్బా' అనే టాస్క్ ఇచ్చారు బిగ్ బాస్. ఈ టాస్క్ లో సంచాలకులను ఇంటి సభ్యులే ఎన్నుకోవాలి. ఆ వ్యక్తిదే తుది నిర్ణయం అంటూ బిగ్ బాస్ నియమం పెట్టారు.

దీంతో హౌస్ మేట్స్ ఎవరిని పెడితే బాగుంటుందని ఆలోచిస్తోన్న సమయంలో నేను ఉంటునని చేతులు ఎత్తింది దీప్తి సునయన. ఈ టాస్క్ లో తనీష్, దీప్తి నల్లమోతు ఓ గోడకు పెయింట్ వేయడంలో పోటీ పడాలి. వీరిద్దరి మధ్య గోడ కోసం పోటీ గట్టిగానే జరిగినట్లు తాజాగా విడుదల చేసిన ప్రోమో బట్టి తెలుస్తోంది. ఒకరిపై ఒకరు పడిపోయి మరీ గోడకి రంగుని అద్దుతున్నారు.

మరి ఈ పోటీలో ఎవరు విజేతగా నిలుస్తారో ఈరోజు ఎపిసోడ్ లో తేలనుంది. సోషల్ మీడియాలో మాత్రం దీప్తి సునయన.. తనీష్ నే ఎంపిక చేస్తుందనే కామెంట్స్ ఎక్కువగా వినిపిస్తున్నాయి.   

 

PREV
click me!

Recommended Stories

Dhurandhar Collection: ధురంధర్‌ మూవీ ఫస్ట్‌ డే కలెక్షన్లు.. రణ్‌వీర్‌ సింగ్‌ సునామీకి బాక్సాఫీస్ షేక్
Pawan kalyan ఉదయ్ కిరణ్ కాంబినేషన్ లో మిస్సైన మల్టీ స్టారర్ మూవీ ఏదో తెలుసా?