బిగ్ బాస్ సీజన్ 7 సక్సెస్ఫుల్ గా ఐదవ వారంలోకి అడుగుపెట్టింది. నాలుగో వారం రతికా రోజ్ ఎలిమినేట్ అయ్యింది. ప్రస్తుతం హౌస్లో పది మంది ఉన్నారు. పవర్ అస్త్ర గెలుచుకున్న ఆట సందీప్, శోభా శెట్టి, పల్లవి ప్రశాంత్ నామినేషన్స్ నుండి మినహాయింపు పొందారు. శివాజీ పవర్ అస్త్ర కోల్పోయిన నేపథ్యంలో అతడు నామినేట్ అయ్యాడు. అమర్, శోభా, తేజా, శివాజీ, యావర్, ప్రియాంక, గౌతమ్ , శుభశ్రీ నామినేట్ అయ్యారు.
ఇవాళ ప్రసారం కానున్న ఎపిసోడ్ ప్రోమో విడుదల కాగా ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకున్నాయి. కిచెన్ లో ఎవరూ లేకపోవడంతో వంట చేస్తున్న శుభశ్రీకి గౌతమ్ పులిహోర కలిపాడు. లాయల్ గా ఉండాలి. ఇచ్చిన మాట నిలబెట్టుకోవడమే లాయల్టీ అన్నాడు. మెల్లగా కన్విన్స్ చేసి ఒక రొమాంటిక్ హగ్ కొట్టేశాడు. గౌతమ్, శుభశ్రీ ఒకరినొకరు కౌగిలించుకున్నారు. పవర్ అస్త్ర కోల్పోయిన శివాజీ అసహనానికి గురయ్యాడు. కనీసం కాఫీ కూడా ఇవ్వడం లేదు. నాది కూడా ఒక బతుకేనా అంటూ తేజా, పల్లవి ప్రశాంత్ లతో చెప్పాడు.
ఇది ఆత్మవిశ్వాసాన్ని దెబ్బ తీస్తుంది అన్నాడు. ఇక ఐదు వారాల నామిషన్స్ ముగియడంతో బిగ్ బాస్ పవర్ అస్త్రలను వెనక్కి తీసుకున్నాడు. సందీప్, శోభా, పల్లవి ప్రశాంత్ తాము గెలుచుకున్న పవర్ అస్త్ర ఒక బాక్సులో పెట్టి ఇచ్చేశారు. దీనికి శివాజీ సంతోషం వ్యక్తం చేశాడు. తనతో పాటు ఆ ముగ్గురు కూడా పవర్ అస్త్ర కోల్పోవడం ఆయనకు హ్యాపీగా అనిపించింది.
శివాజీ తీరుకు శోభా శెట్టి అసహనం వ్యక్తం చేసింది. కొందరు దారుణంగా ఉంటారు. తమకు దక్కకపోతే ఇంకెవరికీ దక్కకూడదు అనుకుంటారు, అని శివాజీని ఉద్దేశించి అన్నది. మరోవైపు ఒకేసారి ఐదుగురు కంటెస్టెంట్స్ వైల్డ్ కార్డు ద్వారా హౌస్లోకి వెళ్లనున్నారట. ఇది మినీ లాంచింగ్ ఈవెంట్ లాంటిదే అంటున్నారు. సీరియల్ నటుడు అంబటి అర్జున్, సీరియల్ నటి పూజా మూర్తి, భోలే షామిలి, అంజలి పవన్, నాయని పావని ఈ లిస్ట్ లో ఉన్నారు. ఈ కంటెస్టెంట్స్ హౌస్లో అడుగుపెడుతున్నారనేది తాజా సమాచారం.