మాట తూలుతున్నావని ఒకరంటే నేనింతే అంటూ మరొకరు...  ఆదిత్య-గీతూ మధ్య వేడెక్కిన వాతావరణం!

By Sambi ReddyFirst Published Oct 28, 2022, 1:27 PM IST
Highlights


హౌస్ లో గీతూ గలాటా ఎక్కువైంది. ఎవరినీ లెక్క చేయని యాటిట్యూడ్ తో గీతూ రచ్చ చేస్తుంది.తాజాగా కిచెన్ లో బాల ఆదిత్య-గీతూ పరస్పరం గొడవ పడ్డారు. 
 


మొదటి నుండి గీతూ లెక్క చేయని యాటిట్యూడ్ చూపిస్తున్నారు. ఎవరేమనుకుంటే నాకేంటి నా గేమ్ నాది అంటుంది. అయితే ఒక్కోసారి ఆమె లాజిక్ లేకుండా గొడవకు దిగడం పాపులారిటీ కోల్పోయింది. చేపల చెరువు టాస్క్ లో బిగ్ బాస్ గీతూ-ఆది రెడ్డిలను సంచాలకులుగా నియమించారు. గేమ్ చూసి ప్లేయర్స్ ని జడ్జి చేయాల్సిన గీతూ... ఆమె గేమ్ ఆడుతూ వాళ్ళను ఫుల్ గా డిస్ట్రబ్ చేసింది. తోటి సంచాలకుడు ఆది రెడ్డి నువ్వు గేమ్ ఆడకూడదని చెప్పినా నేను ఆడతా అంటూ వితండ వాదం చేసింది. 

తాజాగా కిచెన్ లో బాల ఆదిత్యతో గొడవకు దిగింది. వెజిటబుల్స్ కట్ చేసినప్పుడు తొక్కలు వెంటనే డస్ట్ బిన్ లో పడేస్తే ఒక పనైపోతుందని బాల ఆదిత్య చెప్పాడు. దానికి నేను అలా పడేయను అని గీతూ ఎదురు సమాధానం చెప్పింది. మంచి వాళ్ళైతే అలా చేస్తారని బాల ఆదిత్య అనగా... నేను మంచి దానిని కాను, నీకు అనుకూలంగా నేను మాట్లాడనని చెప్పింది. దానికి బాల ఆదిత్య మాట తూలుతున్నావు, ఇలా మాట్లాడి పెంట చేసి నెగిటివ్ అవుతున్నావని బాల ఆదిత్య గీతూకు గట్టిగా చెప్పాడు. 

బ్యాడ్ అయితే హ్యాపీగా వెళ్ళిపోతా అంటూ మరో సమాధానం చెప్పింది. కిచెన్ లో బాల ఆదిత్య-గీతూకి పెద్ద వాగ్వాదమే జరిగింది. ఇక కెప్టెన్సీ కంటెండర్స్  గా కీర్తి, శ్రీహాన్, సూర్య నిలిచారు. ఇంటి సభ్యులు ఈ ముగ్గురిలో ఒకరిని కెప్టెన్ ని ఎన్నుకోవాల్సి ఉంది. మెజారిటీ సభ్యులు శ్రీహాన్ కి అనుకూలంగా ఓటు వేసి, మిగతా వాళ్లకు కత్తిపోటు పొడిచారు. దీంతో శ్రీహాన్ హౌస్ కి కొత్త కెప్టెన్ అయ్యాడు. ఇక ఈ వారం మొత్తం 14 మంది ఇంటి సభ్యులు నామినేషన్స్ లో ఉన్నారు. దీంతో ఎవరు ఎలిమినేట్ అవుతారనే ఆసక్తి నెలకొని ఉంది. 7వ ఎలిమినేషన్ ద్వారా అర్జున్ కళ్యాణ్ బయటకు వెళ్ళిపోయాడు. సీజన్ దాదాపు సగానికి చేరింది. కొందరు స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ గా అవతరించారు. 
 

The captaincy task brings out a lot of emotions in the Bigg Boss house!

Ee vaaram captain ayyedi evaru? To find out, watch today's episode of Bigg Boss on , streaming 24/7 on . pic.twitter.com/DhtclZmtDt

— starmaa (@StarMaa)
click me!