Bheemla Nayak : మొదలైన ‘బీమ్లా నాయక్’ చివరి సాంగ్ షూటింగ్.. త్వరలో రిలీజ్ డేట్ పైనా అప్డేట్..

Published : Feb 13, 2022, 01:11 PM ISTUpdated : Feb 13, 2022, 01:13 PM IST
Bheemla Nayak : మొదలైన ‘బీమ్లా నాయక్’ చివరి సాంగ్  షూటింగ్.. త్వరలో రిలీజ్ డేట్ పైనా  అప్డేట్..

సారాంశం

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan)నటిస్తున్న చిత్రం ‘బీమ్లా నాయక్’ చివరి సాంగ్ షూటింగ్ మళ్లీ మొదలైంది. ఈ షూటింగ్ పూర్తి చేసుకుంటే సినిమా చిత్రీకరణ మొత్తం పూర్తైయినట్టే.. ఈ సందర్భంగా రిలీజ్ డేట్ పైనా రెండు మూడు రోజుల్లో మరో అప్డేట్ ఇవ్వనున్నారు మేకర్స్.   

పవన్ కళ్యాణ్ నటిస్తున్న ‘భీమ్లా నాయక్’ (Bheemla Nayak) చిత్రం చివరి దశ షూటింగ్ మళ్లీ ప్రారంభమైంది. సినిమాకు సంబంధించిన లాస్ట్ సాంగ్ - ‘భీమ్ భీమ్ బీమ్లా నాయక్’ షూటింగ్ పనులు ప్రస్తుతం హైదరాబాద్‌లోనే కొనసాగుతున్నాయి. ఈ షెడ్యూల్ పూర్తైయితే షూటింగ్ ముగింపు దశకు చేరుకోనుంది. తర్వలోనే ఈ మూవీ రిలీజ్ డేట్ పైనా అప్డేట్ ఇవ్వనున్నట్టు మేకర్స్ తెలిపారు. కానీ ఫిబ్రవరి 25నే విడుదల చేసేందుకు నిర్మాతలు ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. 

ఈ సినిమా విడుదలపై సోమవారం క్లారిటీ రానుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలో నైట్ కర్ఫ్యూను ఎత్తివేసి, వందశాతం ఆక్యుపెన్సీని కూడా అనుమతిస్తే, ఫిబ్రవరి 25న ‘భీమ్లా నాయక్’ థియేటర్లలోకి రానుంది. దక్షిణ భారతదేశంలోని ఏ ఇతర రాష్ట్రంలోనూ థియేటర్‌లలో ఆక్యుపెన్సీపై పరిమితులు లేవు. ఆంధ్రప్రదేశ్ లో COVID-19 ఆంక్షలు ఫిబ్రవరి 14న (రేపటితో) ముగుస్తాయి. దీంతో థియేటర్లపైనా ఆంక్షల ప్రభావం పడింది.  ఏదేమైనా పవన్ కళ్యాణ్ 'భీమ్లా నాయక్' అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రాజెక్ట్‌లలో ఒకటి. ఫిబ్ర‌వ‌రి 25న విడుద‌లైతే మాత్రం ఓపెనింగ్స్ బీభత్సం సృష్టించనున్నాయి.  

 

`భీమ్లా నాయక్‌` చిత్రంలో పవన్‌, రానా హీరోలుగా నటిస్తుండగా, నిత్యా మీనన్‌, సంయుక్త మీనన్‌ హీరోయిన్లుగా యాక్ట్ చేస్తున్నారు. నివేదా థామస్‌ కీలక పాత్రలో కనిపించబోతుంది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. మలయాళంలో సూపర్‌ హిట్‌ అయిన `అయ్యప్పనుమ్‌ కోషియుమ్‌` చిత్రానికిది రీమేక్‌. సాగర్‌ కె చంద్ర దర్శకత్వం వహిస్తుండగా, త్రివిక్రమ్‌ మాటలు, స్క్రీన్‌ప్లే అందిస్తున్నారు. ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నారు. 

కరోనా పరిస్థితులను బట్టి.. మేకర్స్ ఇచ్చిన లాస్ట్ అప్డేట్ ప్రకారం  `భీమ్లా నాయక్‌` చిత్రం రిలీజ్ డేట్ ను ఫిబ్రవరి 25న లేదంటే ఏప్రిల్ 1న ప్రకటించారు. కానీ తాజాగా సీని ప్రముఖులు ఏపీ సీం జగన్ మోహన్ రెడ్డిని కలిసి థియేటర్స్ ఆక్యుపెన్సీ, టికెట్ల ధరలు, బెనిఫిట్ షోలపై చర్చించారు. ఈ సందర్భంగా రేపు ఏపీ ప్రభుత్వం నుంచి జీవో వెలువడనుంది. జీవో ఆధారంగా ‘భీమ్లా నాయక్’ నిర్మాణ సంస్థ రిలీజ్ డేట్ ను ఫైనల్ చేయనుంది.  

PREV
Read more Articles on
click me!

Recommended Stories

పవన్ కళ్యాణ్ కు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న ముగ్గరు ప్రాణ స్నేహితులు ఎవరో తెలుసా? వారితో అనుబంధం ఎలా?
Gunde Ninda Gudi Gantalu: రోహిణీని ముప్పు తిప్పలు పెట్టిన బాలు, గుణ కుట్రలో ఇరుక్కుపోయిన శివ