సినిమా మాత్రం ప్రేక్షకుల అంచనాలను అందుకోలేకపోయింది అంటూ కమల్ అభిమనులతో పాటు సగటు ఆడియన్స్ కూడా నిరాశ చెందారు.
కమల్హాసన్- ప్రముఖ దర్శకుడు శంకర్ కాంబినేషన్లో రూపొందిన చిత్రం ‘భారతీయుడు-2’. 28 ఏళ్ల క్రితం ఇదే కాంబినేషన్ లో రూపొందిన భారతీయుడు చిత్రానికి ఇది సీక్వెల్. సిద్దార్థ్, రకుల్ ప్రీత్సింగ్ ముఖ్యపాత్రలో నటించిన ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్ పతాకంపై సుభాస్కరన్ అత్యంత భారీ బడ్జెట్తో ఈ చిత్రాన్ని నిర్మించారు. ఎన్నో ఎక్సపెక్ఠేషన్స్ తో ఈ చిత్రం ఇటీవల ప్రేక్షకుల ముందుకొచ్చిన సంగతి తెలిసిందే.
అయితే ఊహించని విధంగా చిత్రానికి మొదటిరోజే భారీ ఫ్లాప్ టాక్ను తెచ్చుకుంది. ముఖ్యంగా శంకర్పై విమర్శలు వెలువెత్తాయి. కంటెంట్ లేకుండా భారీగా ఖర్చుపెట్టారు. కానీ సినిమా మాత్రం ప్రేక్షకుల అంచనాలను అందుకోలేకపోయింది అంటూ కమల్ అభిమనులతో పాటు సగటు ఆడియన్స్ కూడా నిరాశ చెందారు. ఈ నేపధ్యంలో ఈ చిత్రం తెలుగులో ఎంత బిజినెస్ అయ్యింది..బ్రేక్ ఈవెన్ కు ఎంత దూరంగా ఉందో చూద్దాం. అలాగే ఈ చిత్రం పది రోజులకలెక్షన్స్ రోజు వారి చూద్దాం.
తెలుగు రాష్ట్రాల్లో భారతీయుడు రోజువారి కలెక్షన్స్
👉రోజు 1: 6.75CR
👉రోజు 2: 2.88CR
👉రోజు 3: 1.84CR
👉రోజు 4: 46L~
👉రోజు 5: 43L~
👉రోజు 6: 46L~
👉రోజు 7: 16L~
👉రోజు 8: 13L~
👉రోజు 9: 16L~
👉రోజు 10: 13L~
ఆంధ్రా- తెలంగాణా టోటల్ :- 13.40CR(22.80CR~ Gross)
జీఎస్టీతో కలిపి ఏరియావైజ్ కలెక్షన్స్
👉నైజాం: 5.89Cr
👉సీడెడ్ : 1.76Cr
👉ఉత్తరాంధ్ర : 1.60Cr
👉ఈస్ట్ గోదావరి : 95L
👉వెస్ట్ గోదావరి : 64L
👉గుంటూరు: 1.15Cr
👉కృష్ణా : 92L
👉నెల్లూరు : 49L
ఆంధ్రా - తెలంగాణా టోటల్ :- 13.40CR(22.80CR~ Gross)
ఓవరాల్ గా తెలుగు రాష్ట్రాల్లో బిజినెస్ = 24Cr
బ్రేక్ ఈవెన్= 25Cr
ఇంకా ఎంతొస్తే బ్రేక్ ఈవెన్ అవుతుంది 11.60Cr
మరో ప్రక్క స్ట్రీమింగ్ అయ్యేలా చేసుకున్నట్లు సమాచారం. అయితే ఇప్పుడు సినిమా డిజాస్టర్ టాక్ చూసాక...మొత్తం మారిపోయింది. ఈ సినిమాని ఆగస్ట్ 2 నుంచి స్ట్రీమ్ చేసేందుకు నెట్ ప్లిక్స్, నిర్మాతలతో మాట్లాడి ఎగ్రిమెంట్స్ మారుస్తున్నట్లు సమాచారం.
రెండున్నర దశాబ్దాల కిందట వచ్చిన భారతీయుడు చిత్రం ఎంత పెద్ద హిట్టయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆ చిత్రానికి సీక్వెల్ గా భారీ బడ్జెట్ తో లైకా ప్రొడక్షన్స్, రెడ్ జెయింట్ మూవీస్ బ్యానర్లపై భారతీయుడు-2 చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ చ్రితంలో కమల్ హాసన్, సిద్ధార్థ్, రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా భవానీ శంకర్, బాబీ సింహా, సముద్రఖని తదితరులు నటించారు. ఈ సినిమాకు అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించాడు.