‘భైరవగీత’ట్రైలర్‌: వర్మ తీసి శిష్యుడు పేరు వేసారా? !

By Prashanth MFirst Published Nov 4, 2018, 10:12 AM IST
Highlights

టైటిల్ కార్డ్ లో డైరక్టర్ ఎవరో చూడకుండా ఇది రామ్ గోపాల్ వర్మ చిత్రం అని  గుర్తు పట్టచ్చు. అంతలా తనకంటూ ఓ స్టైల్ ని, శైలిని ఏర్పాటు చేసుకున్న దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. ఆయన శిష్యులు కూడా ఆయన స్టైల్ నే అనుసరిస్తూ, అనుకరిస్తూంటారు. 

టైటిల్ కార్డ్ లో డైరక్టర్ ఎవరో చూడకుండా ఇది రామ్ గోపాల్ వర్మ చిత్రం అని  గుర్తు పట్టచ్చు. అంతలా తనకంటూ ఓ స్టైల్ ని, శైలిని ఏర్పాటు చేసుకున్న దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. ఆయన శిష్యులు కూడా ఆయన స్టైల్ నే అనుసరిస్తూ, అనుకరిస్తూంటారు. 

ముఖ్యంగా ఆయన పర్యవేక్షణలో తీసిన సినిమాలు అయితే వర్మే డైరక్ట్ చేసి, శిష్యుడు పేరు వేసేరేమో అనే సందేహం కూడా వస్తూంటుంది. తాజాగా విడుదలైన ‘భైరవగీత’ ట్రైలర్‌ చూసిన వారికి కూడా అదే సందేహం ఖచ్చితంగా వస్తుంది.  

‘ఎవ్వరినీ ఇడిసి పెట్టొద్దూ.. ఏడిపిద్దాం.. ఒక్కొక్కణ్ణి చంటిపిల్లల్లా గుక్కపట్టి ఏడ్చేలా ఏడిపిద్దాం.. ఆళ్ల రక్తంతో ఈ సీమకి అభిషేకం చేద్దాం’.. అనే పవర్‌ఫుల్ డైలాగ్‌తో ‘భైరవగీత’ చిత్ర ట్రైలర్ విడుదలైంది. ఈ టైటిల్ మీరు ఇక్కడ చూడవచ్చు.   

రామ్ గోపాల్ వర్మ  స్టైల్లోనే సాగుతున్న ఈ  చిత్రం ట్రైలర్‌లో..   ఎమోషన్స్‌ను పీక్స్ లో చూపెట్టారు. ఆర్జీవీ సమర్పణలో తెరకెక్కుతున్న ఈ సినిమాకి వర్మశిష్యుడు సిద్ధార్థ్‌ తాతోలు డైరక్ట్ చేస్తున్నాడు. తెలుగు, కన్నడ భాషల్లో ఒకేసారి తెరకెక్కుతున్న ఈ సినిమా పబ్లిసిటీ క్యాంపైన్ ను  వర్మ దగ్గరుండి చూసుకుంటున్నాడు.  

అలాగే ట్రైలర్ లో ..ఆలోచనను...ఆలోచించిన మనిషిని చంపలేకపోతే ఏం చెయ్యాలి....ఆ ఆలోచన ఎవరి గురించో వారిని చంపేయాలి..అంటూ వినిపించిన డైలాగ్‌లు సైతం జనాల్లోకి వెళ్లాయి.   నిజ జీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కతోంది అని చెప్పబడుతున్న ఈ చిత్రం  లో ధనుంజయ్‌, ఇర్రా మోర్‌లు హీరో హీరోయిన్లు నటించారు. ఈ చిత్రం నవంబర్‌ 22న విడుదలకానుంది.  

click me!