రాజమౌళికి ధైర్యం చెప్పి,సూచన చేసిన బండ్ల గణేష్

By Surya PrakashFirst Published Jul 30, 2020, 6:22 AM IST
Highlights

బండ్ల గణేశ్ కూడా ఈ మధ్యనే కరోనా బారిన పడి, కోలుకున్న సంగతి తెలిసిందే. తన అనుభవాలను దృష్టిలో ఉంచుకుని రాజమౌళికి గణేశ్ ఈ సూచనలు చేశారు.తాజాగా టాలీవుడ్ దర్శక దిగ్గజం రాజమౌళి కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా తెలిపారు. 


 దర్శక దిగ్గజం రాజమౌళికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయిందనే వార్తలతో టాలీవుడ్ ఉలిక్కి పడింది. ఆయన త్వరగా కోలుకోవాలని ఆశిస్తూ అందరూ ఆకాంక్షిస్తున్నారు. ఈ నేపథ్యంలో సినీ నటుడు, బండ్ల గణేశ్ ట్విట్టర్ ద్వారా స్పందించారు.

ఈ ట్వీట్ లో .. 'హ్యాపీగా ఉండండి సర్. ఏమీ కాదు. ప్రతి రోజు కోడి గుడ్లు తినండి. విశ్రాంతి తీసుకోండి. హాయిగా నిద్రపోండి' అని సూచించారు. బండ్ల గణేశ్ కూడా ఈ మధ్యనే కరోనా బారిన పడి, కోలుకున్న సంగతి తెలిసిందే. తన అనుభవాలను దృష్టిలో ఉంచుకుని రాజమౌళికి గణేశ్ ఈ సూచనలు చేశారు.
https://twitter.com/ganeshbandla/status/1288501304168345601

ఇక దేశ వ్యాప్తంగా పలువురు సినీ ప్రముఖులు కరోనా బారిన పడుతున్న సంగతి తెలిసిందే. తాజాగా టాలీవుడ్ దర్శక దిగ్గజం రాజమౌళి కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా తెలిపారు. రెండు రోజుల క్రితం తాను, తన కుటుంబసభ్యులు స్వల్ప జ్వరంతో బాధపడ్డామని చెప్పారు. జ్వరం తగ్గిపోయిందని... అయినప్పటికీ తాము కోవిడ్ టెస్టులు చేయించుకున్నామని... తమకు స్వల్ప స్థాయిలో కోవిడ్ పాజిటివ్ నిర్ధారణ అయిందని తెలిపారు.

 వైద్యుల సూచనల మేరకు హోం క్వారంటైన్ లో ఉన్నామని చెప్పారు. ఇప్పుడు బాగానే ఉన్నామని తెలిపారు. కరోనా లక్షణాలు లేకపోయినా అన్ని నిబంధనలు పాటిస్తున్నామని, జాగ్రత్తలు తీసుకుంటున్నామని చెప్పారు. యాంటీబాడీలను డెవలప్ చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నామని... ఆ తర్వాత ప్లాస్మా దానం చేస్తామని తెలిపారు. 

click me!