
నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘వీరసింహారెడ్డి’.శృతి హాసన్ హీరోయిన్గా నటించిన ఈ చిత్రం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కింది. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ భారీ ఎత్తున నిర్మించింది. సంక్రాంతి కానుకగా ఈ నెల 12న విడుదలైన వీరసింహారెడ్డి తొలి రోజునే రికార్డు బ్రేక్ కలెక్షన్స్ సాధించి, ఆ తర్వాత వరస రికార్డ్ లతో దూసుకుపోయింది. తాజాగా ఈ చిత్రం మరో మైల్ స్టోన్ ని చేరింది.
ప్రతి వారం అనేక రిలీజులు స్క్రీన్ల కోసం పోటీ పడుతున్న నేపథ్యంలో, థియేట్రికల్ బిజినెస్ 2-3 వారాల వ్యవహారంగా మారింది. ఈ తరుణంలో సినిమా 50 రోజుల పాటు నాన్స్టాప్గా థియేటర్లో నడవడం అరుదైన, పెద్ద విజయం సాధించింది. నటసింహ నందమూరి బాలకృష్ణ వీరసింహా రెడ్డి సినిమా థియేటర్లలో విజయవంతంగా 50 రోజుల రన్ పూర్తి చేసుకుని, అన్ని వర్గాలకు సంబంధించిన అంశాలతో కూడిన మంచి కంటెంట్ చిత్రాలను పోటీతో సంబంధం లేకుండా ప్రేక్షకులు ఎల్లప్పుడూ ఆదరిస్తున్నారనే వాస్తవాన్ని నిరూపించింది. ఈ చిత్రం 23 డైరెక్ట్, 54 షిఫ్టింగ్ థియేటర్లలో ఈ ఫీట్ సాధించింది. ఇది బాలకృష్ణకు హయ్యెస్ట్ గ్రాసర్గా నిలిచింది.
ట్రేడ్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా డిస్ట్రిబ్యూషన్ షేర్ ...75.7 కోట్లు సాధించింది. అఖండ తర్వాత ఈ సినిమా మరోసారి భాక్సాఫీస్ దగ్గర దుమ్ము రేపింది. అయితే గ్రాస్ నెంబర్స్ మాత్రం అఖండ టాప్ లో ఉంది. ఇప్పటికీ కొన్నిచోట్ల పర్శంటేజ్ మీద ఈ సినిమా ఆడుతోంది.
ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం క్లోజింగ్ 75.90 కోట్లు (69.95 కోట్లు Excl GST) సాధించింది. అందులో ఆంధ్రా,తెలంగాణా కలిసి 65.50 Cr, ఓవర్ సీస్ 5.85 Cr, రెస్టాఫ్ ఇండియా 4.55 Cr వచ్చింది. ప్రీ రిలీజ్ బిజినెస్ 75 కోట్లు చేసింది. కాబట్టి సినిమా సకెస్స్ ఫుల్ గా నడిచింది. అలాగే...ఈ సినిమా ఓటిటి రైట్స్, శాటిలైట్ రైట్క్, యూట్యూబ్ రైట్స్, హిందీ రైట్స్ అదనం. వాటిద్వారా భారీగా నిర్మాతకు లాభం వస్తుంది.
వీరసింహారెడ్డి పూర్తిగా మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ కాదు. గోపీచంద్ మలినేని దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో బ్రీత్ టేకింగ్ యాక్షన్ తో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్, ఆకట్టుకునే డ్రామా సమపాళ్లలో ఉన్నాయి. బాలకృష్ణ తండ్రి కొడుకులుగా ద్విపాత్రాభినయం చేశారు. శృతి హాసన్ కథానాయికగా నటించగా, హనీ రోజ్, వరలక్ష్మి శరత్కుమార్, దునియా విజయ్ కీలక పాత్రల్లో కనిపించారు. మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించారు.ఎస్ థమన్ ఒక చార్ట్బస్టర్ ఆల్బమ్ను అందించాడు. వీరసింహారెడ్డి బాలకృష్ణ, తమన్ కాంబినేషన్లో రెండవ బ్లాక్బస్టర్.
‘అఖండ’ వంటి భారీ విజయం తర్వాత బాలకృష్ణ, ‘క్రాక్’ వంటి బ్లాక్బస్టర్ విజయం తర్వాత గోపిచంద్ మలినేని.. ఇద్దరు కలిసి రావడంతో ప్రేక్షకులు థియేటర్లకు పోటెత్తారు. దానితో పాటుగా చిత్రబృందం విడుదల చేసిన పోస్టర్లు, ట్రైలర్ సినిమాపై విపరీతమైన బజ్ క్రియేట్ చేశాయి. భారీ అంచనాల నడుమ గురువారం రిలీజైన ఈ సినిమా మిక్స్డ్ రివ్యూలు తెచ్చుకుంది. కానీ టాక్తో సంబంధంలేకుండా ఓపెనింగ్స్ భారీ స్థాయిలో రాబట్టింది. రెండు తెలుగు రాష్ట్రాలలో కలెక్షన్ల పరంగా కుమ్మేయటం కలిసొచ్చింది. అటు ఓవర్సీస్లో (Oversease) కూడా ఈ రెండు సినిమాలకు మంచి వసూళ్లు వచ్చాయి. ప్రధానంగా యూఎస్ బాక్సాఫీస్ (US Boxoffice) వద్ద వీరయ్య, వీరసింహా కనకవర్షం కురిపించాయి.