అజిత్ ఫ్యాన్స్ కి కరోనా షాక్.. వాళ్ళ ఆశలపై నీళ్లు!

By team teluguFirst Published Apr 23, 2021, 9:03 PM IST
Highlights

అజిత్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్న వాలిమై ఫస్ట్ లుక్ విడుదలపై నిర్మాతలు బాంబ్ పేల్చారు. చెప్పిన విధంగా వాలిమై ఫస్ట్ లుక్ విడుదల లేదంటూ స్పష్టత ఇచ్చారు.

కోలీవుడ్ టాప్ స్టార్స్ లో ఒకరిగా ఉన్న అజిత్ కుమార్ కి భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఆయన మూవీ అప్డేట్ అంటే చాలు ఫ్యాన్స్ సోషల్ మీడియాను షేక్ చేస్తారు. కాగా అజిత్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్న వాలిమై ఫస్ట్ లుక్ విడుదలపై నిర్మాతలు బాంబ్ పేల్చారు. చెప్పిన విధంగా వాలిమై ఫస్ట్ లుక్ విడుదల లేదంటూ స్పష్టత ఇచ్చారు. 


అజిత్ 50వ బర్త్ డే పురస్కరించుకొని వాలిమై ఫస్ట్ లుక్ మే 1న విడుదల చేయాలని నిర్ణయించడం జరిగింది. దీనిపై ప్రకటన కూడా రావడంతో ఫ్యాన్స్ ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. అయితే కరోనా సెకండ్ వేవ్ దేశాన్ని కుదిపేస్తోంది. అయిన వారిని పోగొట్టుకున్న కుటుంబ సభ్యులు, ఉద్యోగాలు, ఉపాధి పోయిన కార్మికులు మానసిక వేదన అనుభవిస్తున్నారు. 


ఈ సమయంలో మే 1న వాలిమై ఫస్ట్ లుక్ విడుదల చేయడం మంచిది కాదని నిర్మాతలు నిర్ణయించారు. అజిత్ బర్త్ డే నాడు వాలిమై ఫస్ట్ లుక్ విడుదల లేదంటూ అధికారిక ప్రకటన విడుదల చేశారు. దీనితో అజిత్ ఫ్యాన్స్ తీవ్ర నిరాశకు గురయ్యారు.

 
యాక్షన్ ఎంటర్టైనర్ గా వాలిమై తెరకెక్కుతుంది. దర్శకుడు హెచ్ వినోద్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. బోనీకపూర్ వాలిమై నిర్మాతగా ఉన్నారు. టాలీవుడ్ యంగ్ హీరో కార్తికేయ వాలిమై మూవీలో కీలక రోల్ చేయడం విశేషం.
 

pic.twitter.com/ojvavsNVt3

— Boney Kapoor (@BoneyKapoor)
click me!