
పవన్ కళ్యాణ్ రానా హీరోలుగా అయ్యప్పనుమ్ కోషియుమ్ను తెలుగులో రీమేక్ చేస్తోన్న సంగతి తెలిసిందే. యువ దర్శకుడు సాగర్ కే చంద్ర తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రానికి స్క్రీన్ ప్లే, మాటలు త్రివిక్రమ్ అందిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ కూడా సగానికి పైగానే పూర్తయింది.
తాజాగా ఈ సినిమాలో నిత్యామీనన్ ఎంటర్ అయ్యింది. దీనికి సంబంధించి చిత్రబృందం అధికారిక ప్రకటన విడుదల చేసింది. నిత్యా మీనన్ ఈ సినిమాలో పవన్ సరసన.. ఆయన భార్య గా నటించనుందని తెలుస్తోంది. పవన్ ఈ సినిమాలో భీమ్లా నాయక్గా కనిపించనున్నారు. ఈ సినిమాకు పరశురామ కృష్ణమూర్తి అనే టైటిల్ను పరిశీలిస్తున్నారట.
ఈ సినిమా రిలీజ్ డేట్ కూడా కన్ఫర్మ్ చేసింది చిత్రబృందం. ఈ సినిమా వచ్చే సంక్రాంతికి విడుదలకానుంది.ఈ సినిమాలో రానాకు జోడిగా ఐశ్వర్యా రాజేష్ నటిస్తున్నారు. సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.