ప్రముఖ సినీనటి, రాజకీయ నాయకురాలు ఖుష్బూకు ఊహించని పరాభవం ఎదురైంది. ఆమె ప్రయాణిస్తున్న కారుపై ఆందోళనకారులు కోడిగుడ్లు, టమోటాలు విసిరారు. 2015 లో మహిళల మానం గురించి ఆమె కొన్ని సంచలన వ్యాఖ్యలు చేయగా.. ఆమెపై కేసులు నమోదయ్యాయి.కేసు విచారణకు గాను ఖుష్బూ బుధవారం మేటూర్ కోర్టుకు హాజరయ్యారు. ఆ సందర్భంలో నిరసనకారులు ఆమె కారుపై దాడికి పాల్పడ్డారు. అటు-ఈ కేసు విచారణను కోర్టు ఈనెల 6 వ తేదీకి వాయిదా వేసింది.