OTT: ఓటీటీకి ‘అశోకవనంలో అర్జున కల్యాణం’, స్ట్రీమింగ్‌ ఎక్కడంటే

By Surya PrakashFirst Published May 17, 2022, 4:20 PM IST
Highlights

విశ్వక్ సేన్ హీరోగా మే నెల 6న రిలీజ్ అయింది అశోక వనంలో అర్జున కళ్యాణం సినిమా. ఈ సినిమాలో రుక్షర్ ఢిల్హాన్ హీరోయిన్ గా నటించింది. విద్యాసాగర్ తెరకెక్కించిన ఈ సినిమాను సుధీర్, బాపినీడు నిర్మించారు. 


 ‘ఫ‌ల‌క్‌నుమా దాస్’ నుంచి పాగ‌ల్ వ‌రకు వైవిధ్య‌మైన కథలతో మెప్పిస్పున యంగ్‌ హీరో విశ్వక్‌ సేన్‌ నటించిన తాజా చిత్రం ‘అశోకవ‌నంలో అర్జున క‌ళ్యాణం’. ఇప్పటి వరకు మాస్‌ లుక్‌లో కనిపించిన విశ్వక్‌ ఈ సినిమా క్లాస్‌గా కనిపించాడు. దీంతో ఈ సినిమాపై హైప్‌ క్రియేట్‌ అయ్యింది.  విద్యాసాగర్‌ చింత ఈ చిత్రానికి  దర్శకత్వం వహించిన ఈ సినిమా మే 6న థియేటర్లో విడుదలైంది. పెద్ద వివాదం తర్వాత రిలీజ్ అవుతున్న సినిమా కావడంతో అందరిలో క్యూరియాసిటీ నెలకొంది.

 గ్రామీణా నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం పెళ్లి అనే కాన్సెప్ట్‌ చూట్టూ తిరుగుతుంది. ఫ్యామిలీ ఎమోషన్స్‌, కామెడీగా సాగే ఈ సినిమా విడుదలైన ప్రీమియర్‌ షో నుంచి మిక్స్‌డ్‌ టాక్‌ తెచ్చుకుంది. కొంతమంది ఫన్నీగా ఉంది అంటుండగా మరికొందరు సినిమాను చాలా లాగ్‌ చేశారన్నారు. ఇలా డివైడ్ టాక్ తెచ్చుకుంటూ యవరేజ్‌గా నిలిచినా కలెక్షన్స్ పరంగా బాగుందనిపించింది.  ఈమూవీ త్వరలోనే ఓటీటీలో కూడా సందడి చేయబోతోంది. ఇప్పటికే ప్రముఖ తొలి తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫాం ఆహా వీడియో ఈ మూవీ ఓటీటీ రైట్స్‌ను సొంతం చేసుకుంది. ఈ నెల 27 నుంచి ఈ చిత్రం ఓటిటిలో స్ట్రీమింగ్ అవుతోంది.
 
విశ్వక్‌ సేన్‌కు యూత్‌లో ఉన్న క్రేజ్‌ దృష్ట్యా ఈ సినిమాను మంచి ఫ్యాన్సీ రేటుకు ఆహా కొనుగొలు చేసిందట. అయితే ఈ సినిమా నెల రోజుల తర్వాత ఆహా విడుదల కానుందని టాక్‌. అంటే జూన్‌ మొదటి వారంలో ఈమూవీ ఓటీటీలో విడదుల కానుందన్న మాట. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన కూడా వెలువడనుందని సినీ వర్గాల నుంచి సమాచారం. బి.వి.ఎస్‌.ఎన్‌.ప్ర‌సాద్ స‌మర్ఫ‌ణ‌లో ఎస్‌వీసీసీ డిజిట‌ల్ బ్యాన‌ర్‌పై బాపినీడు, సుధీర్ ఈద‌ర‌ ఈ చిత్రాన్ని నిర్మించారు.  జై క్రిష్ ఈ సినిమాకు సంగీతం అందించిన ఈ సినిమాలో రుక్సార్‌ దిల్లాన్‌ హీరోయిన్‌గా నటించింది. 
 

click me!