సక్సెస్‌ కోసం పేరు మార్చుకున్న యంగ్‌ హీరో.. `90's కిడ్స్ బే ఈడా` అంటూ రచ్చ.. వర్మ హల్‌చల్‌

Published : Feb 02, 2022, 11:31 PM ISTUpdated : Feb 02, 2022, 11:33 PM IST
సక్సెస్‌ కోసం పేరు మార్చుకున్న యంగ్‌ హీరో.. `90's కిడ్స్ బే ఈడా` అంటూ రచ్చ.. వర్మ హల్‌చల్‌

సారాంశం

అరుణ్‌ ఆదిత్‌.. యంగ్‌ హీరోగా రాణిస్తున్నారు. మంచి సినిమాలు చేసిన సరైన హిట్లు లేకపోవడంతో హీరోగా ఆశించిన గుర్తింపు దక్కలేదు. దీంతో ఇప్పుడు సక్సెస్‌ కోసం పేరు మార్చుకున్నాడు. 

అరుణ్‌ ఆదిత్‌.. యంగ్‌ హీరోగా రాణిస్తున్నారు. మంచి సినిమాలు చేసిన సరైన హిట్లు లేకపోవడంతో హీరోగా ఆశించిన గుర్తింపు దక్కలేదు. దీంతో ఇప్పుడు సక్సెస్‌ కోసం పేరు మార్చుకున్నాడు. త్రిగున్‌గా పరిచయం అవుతున్నారు. త్రిగున్‌గా హీరోగా పరిచయం అవుతూ `కార్టూన్స్ః 90's కిడ్స్ బే ఈడా` అనే చిత్రంలో నటిస్తున్నారు. దీపాల ఆర్ట్స్ పతాకంపై త్రిగున్, పాయల్ రాధాకృష్ణ, దీపక్ సరోజ్, హర్ష,నటీనటులు గా సాయి తేజ సప్పన్న దర్శకత్వంలో శ్రీకాంత్ దీపాల, సుధీర్ రెడ్డి తుమ్మ  సంయుక్తంగా నిర్మిస్తున్నచిత్రమిది. 90's లో పుట్టిన వారి అనుభవాలను తెలుపుతూచేసిన అడ్వెంచర్స్ చిత్రమిది. 

ఈ సినిమా బుధవారం రామానాయుడు స్టూడియోలో ప్రారంభమైంది. ముఖ్య అతిథిగా వివాదస్పద సంచలన దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ హాజరయ్యారు. ఆయనతోపాటు నటులు సిద్దు జొన్నలగడ్డ, ఆకాష్ పూరి, ప్రియదర్శి, ముఖ్య అతిధులుగా పాల్గొన్నారు. పూజా కార్యక్రమాలు అనంతరం హీరో, హీరోయిన్ల పై తొలి ముహూర్తపు సన్ని వేశానికి నటుడు సిద్దు జొన్నలగడ్డ క్లాప్ నిచ్చారు. నటుడు ఆకాష్ పూరి కెమెరా స్విచ్ ఆన్ చేయగా, ప్రముఖ దర్శకుడు ఆర్.జీ.వి గౌరవ దర్శకత్వం వహించారు. 

ఈ సందర్భంగా త్రిగున్ మాట్లాడుతూ, `కొండా` బయోపిక్ లో చేస్తున్న నేను ఆర్.జి.వి మంచి కథలను సెలెక్ట్ చేసుకోమని సూచనలు ఇచ్చారు. ఈ సినిమా గురించి తనతో చెప్పడంతో "కార్టూన్" అనే సినిమా ప్రతి ఒక్కరికీ రీచ్ అవుతుందని అప్రిషియేట్ చేశారు. నిర్మాత శ్రీకాంత్  నేను ఇంతకుముందు సినిమా చేద్దాం అనుకున్నాము. కానీ కుదరలేదు. ఇప్పుడు మంచి స్క్రిప్ట్ కుదిరింది. యాక్షన్ సినిమా చేద్దాం అనుకున్న టైం లో దర్శకుడు నాకీ కథ చెప్పాడు. ఈ కథ వినగానే నాకు నా కాలేజ్ డేస్ గుర్తుకు వచ్చాయి. పాయల్ రాధాకృష్ణ చేసిన `తరగతి గది` వెబ్ సిరీస్ తో తనకు మంచి ఫాలోయింగ్ పెరిగింది. ఈ సంవత్సరం మా అందరికీ ఈ చిత్రం తో మంచి పేరు రావాలని మా మనస్ఫూర్తిగా కోరుతున్నా` అని అన్నారు. 

చిత్ర దర్శకుడు సాయి తేజ సప్పన్న మాట్లాడుతూ.. నేను చిన్నప్పటి నుండి పవన్ కళ్యాణ్ అభిమానిని. "డీ" ప్రోగ్రాం లో డాన్సర్ గా, కంటెస్టెంట్ గా కొరియోగ్రాఫర్ గా వర్క్ చేశాను. ఆ తరువాత ఒక  మంచి కథ రాసుకొని నిర్మాత శ్రీకాంత్ గారికి చెప్పా. ఫ్రెండ్షిప్ జోనర్ లో నేను రాసుకున్న ఈ కథ నిర్మాత శ్రీకాంత్ కి నచ్చడంతో ఈ సినిమా చేయడానికి ముందుకు వచ్చారు. ఒక ఫ్రెండ్ ఇంకొక ఫ్రెండ్ ను ఇగ్నోర్ చేస్తే మిగిలిన ఫ్రెండ్స్ ఎలా రియాక్ట్ అవుతారు. ఆ తరువాత ఇగ్నోర్ చేసిన ఫ్రెండ్ ఎలా ఉంటున్నాడు అనే దానిపై ఈ స్టోరీ ని రాయడం జరిగింది. ఫుల్ ఔట్ ఔట్ కామెడీ డ్రామా గా తెరకెక్కుతుంది. 

90's లో పుట్టిన వారి మెమొరబుల్స్ అన్ని ఈ సినిమాల్లో కనిపిస్తాయి. వారు ఈ సినిమా చూస్తున్నప్పుడు వారు చేసిన పనులను గుర్తుకు తెచ్చుకొని హ్యాపీగా ఫీలవుతారు. ఇందులో హీరోగా త్రిగున్, పాయల్ రాధాకృష్ణ హీరో, హీరోయిన్లు గా నటిస్తున్నారు.వారికి ఈ కథ చెప్పినపుడు చాలా ఎగ్సైట్ అయ్యారు. వీరితోపాటు దీపక్ సరోజ్, హర్ష లతో పాటు నేను కూడా ఇందులో పప్పు అనే మంచి క్యారెక్టర్ చేస్తున్నాను. మేం చేస్తున్న ఈ చిత్రాన్ని మీ రందరూ బ్లెస్స్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుతున్నా` అన్నారు.

నిర్మాత  శ్రీకాంత్ దీపాల మాట్లాడుతూ. మా సినిమా పూజా కార్యక్రమానికి వచ్చిన ఆర్.జీ.వి గారికి, సిద్దు జొన్నలగడ్డ, ఆకాష్ పూరి, ప్రియదర్శి, లకు ధన్యవాదాలు. దీపాల ఆర్ట్స్ ప్రొడక్షన్ లో నేను నిర్మిస్తున్న నాలుగవ చిత్రమిది.ఈ సినిమా చేయడానికి ముఖ్య కారణం కథ. తమ్ముడు సాయి తేజ సప్పన్న మంచి కథ రాసుకొన్నాడు.ఈ కథ నాకే కాకుండా అందరికీ నచ్చింది మంచి టీం తో ఫుల్ ఔట్ ఔట్ కామెడీ డ్రామా గా తెరకెక్కుతున్న ఈ చిత్రం ప్రేక్షకులందరికీ కచ్చితంగా నచ్చుతుంది అన్నారు.. 

హీరోయిన్ పాయల్ రాధాకృష్ణ మాట్లాడుతూ.. దర్శకుడు నాకీ కథను చెప్పినపుడు చాలా ఎగ్సైట్ అయ్యాను. ఇలాంటి మంచి ప్రాజెక్ట్ లో నటించే అవకాశం ఇచ్చిన దర్శక,నిర్మాతలకు ధన్యవాదాలు అన్నారు. 

నటీనటులుః త్రిగున్,,పాయల్ రాధాకృష్ణ,దీపక్ సరోజ్,వైవా హర్ష, సాయి తేజ సంపన్న తదితరులు 

సాంకేతిక నిపుణులు
ప్రొడ్యూసర్ : శ్రీకాంత్ దీపాల, సుధీర్ రెడ్డి తుమ్మ, 
డైరెక్టర్ : సాయి తేజ సప్పన్న
డి. ఓ పి : చరణ్ మాధవనేని, 
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : గుంపిన కళ్యాణ్ చక్రవర్తి 
కో రైటర్ అండ్ ఏడి : నరేంద్ర తేజ.ఆర్ 
చీఫ్ అసోసియేట్ డైరెక్టర్ : శివ భారత్ వల్లంశెట్టి అసోసియేట్ డైరెక్టర్ : లక్ష్మీనారాయణ కూనం శెట్టి 
కో-డైరెక్టర్ : వి పురుషోత్తం రెడ్డి 
ఫస్ట్ ఏ డి : గౌతంకుమార్ ఎన్ 
అసిస్టెంట్ డైరెక్టర్ :అరవింద్ సాహుల్.వై
కో డైలాగ్ : విశ్వనాథ్ కందుకూరి 
కాస్ట్యూమ్స్ డిజైనర్ అండ్ స్టైలిష్ట్ : అనన్య మిట్టల్
ఎడిటర్ :: కె.బాలకృష్ణారెడ్డి (బాలు) 
ఆర్ట్ డైరెక్టర్ : పిఎస్ వర్మ 
ప్రొడక్షన్ మేనేజర్ : రమేష్ మిర్తి పాటి 
పి ఆర్ వో : శ్రీపాల్ చోల్లేటి 
పబ్లిసిటీ డిజైనర్ :సోమేశ్ రెడ్డి

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Articles on
click me!

Recommended Stories

Missterious Review: 'మిస్‌టీరియస్' మూవీ రివ్యూ.. ట్రైయాంగిల్ లవ్ స్టోరీలో మిస్టరీ ఆకట్టుకుందా, తేలిపోయిందా ?
అఖండ-2లో బాలయ్య కూతురిగా ఫస్ట్ ఛాయస్ స్టార్ హీరో కూతురట.. ఆమె ఎవరో తెలుసా.?