
చరణ్ దూకుడుమీద ఉన్నాడు. ట్రిపుల్ ఆర్ వల్ల మూడేళ్లు గ్యాప్ రావడంతో.. చరణ్ ముందుగానే మేల్కొన్నాడు. చరణ్ కంటే ముందు నుంచే అంటే 2018 నుంచీ ఎన్టీఆర్ సినిమా చేయలేదు. అయితే తారక్ కంటు ముందే మేల్కొన్ని ట్రిపుల్ ఆర్ రిలీజ్ అవ్వక ముందే శంకర్ తో సినిమా స్టార్ట్ చేశాడు చరణ్. ఇక రామ్ చరణ్ నుంచి రెండు భారీ సినిమాలు ఈ ఏడాది రిలీజ్ కు రెడీ అవుతున్నాయి.
రాజమౌళి దర్శకత్వంలో ఆయన చేసిన ఆర్ఆర్ఆర్ ఈ నెల 25న ఆడియన్స్ ముందుకు రానుంది. దాంతో పాటు కొరటాల దర్శకత్వంలో చేసిన ఆచార్య ఏప్రిల్ 29న విడుదల కానుంది. ఆర్ ఆర్ ఆర్ రిలీజ్ తరువాత ఆచార్య ప్రమోషన్స్ మొదలయ్యేవరకూ ఆయన శంకర్ సినిమాపై దృష్టి పెట్టనున్నాడు.
ఇక స్టార్ డైరెక్టర్ శంకర్ తో తెరకెక్కుతున్న సినిమాను భారీ బడ్జెట్ తో దిల్ రాజు నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో చరణ్ క్యారెక్టర్ ను డిఫరెంట్ గా ప్లాన్ చేశాడట శంకర్. అయితే ఇందులో విలన్ పాత్ర కూడా అంతే డిఫరెంట్ గా ఉంటుందని సమాచారం. ఇక ఈ క్యారెక్టర్ అవినీతి రాజకీయ నాయకుడిగా డిజైన్ చేయబడిందని సమాచారం. ఈ పాత్రను శంకర్ చాలా పవర్ఫుల్ గా డిజైన్ చేశాడట.
ఈ పాత్ర కోసం చాలా మంది పేర్లు వినిపించాయి. అందులో స్టార్ తమిళ్ డైరెక్టర్ ఎస్.జె. సూర్యను దాదాపుగా తీసుకున్నారు అని వార్తలు వచ్చాయి. కానీ తాజాగా ఈ పాత్ర కోసం మాజీ హీరో.. ప్రస్తుతం క్యారెక్టర్ నటుడు అరవింద్ స్వామి పేరు తెరపైకి వచ్చింది. అరవిందస్వామి అయితే ఈ క్యారెక్టర్ కు కరెక్ట్ గా సూట్ అవుతాడు అని మేకర్స్ భావిస్తున్నారట.
గతంలో చరణ్ హీరోగా తెరకెక్కిన ధ్రువ సినిమాలో అరవింద్ స్వామి విలన్ గా మెప్పించాడు. ఈ సినిమాతో చరణ్ కు అరవింద స్వామికి మధ్య రాపో కూడా పెరిగింది. అప్పటి స్నేహాన్ని దృష్టిలో పెట్టుకోవడమే కాకుండా.. అరవిందస్వామి నటనకు ఫిదా అయిన చరణ్.. ఈసినిమాలో ఆయన అయితే బాగుంటాడని చెప్పాడట దాంతో ఈ మూవీలో అరవింద స్వామిని శంకర్ రంగంలోకి దింపుతున్నాడని అంటున్నారు. ఈ సినిమాలో హీరోయిన్ గా కియారా అద్వాని నటిస్తుంది. తమన్ స్వరాలు అందిస్తున్నారు.