అవసరమైతే థియేటర్లు మూసుకుంటాం.. ఏపీ ప్రభుత్వ ఒప్పందంపై సంతకాలు చేయం.. : సినిమా ఎగ్జిబిటర్లు

Published : Jun 16, 2022, 01:02 PM IST
అవసరమైతే థియేటర్లు మూసుకుంటాం.. ఏపీ ప్రభుత్వ ఒప్పందంపై సంతకాలు చేయం.. : సినిమా ఎగ్జిబిటర్లు

సారాంశం

ఆంధ్ర ప్రదేశ్ లో  సినిమా వివాదం మళ్ళీ రాజుకుంటుంది. సినిమా టికెట్లను కంప్లీట్ గా తమ కంట్రోల్ లోకి తెచ్చుకోవాలి అని చూస్తున్న ప్రభుత్వానికి థియేటర్ యజమానులు షాక్ ఇచ్చారు.  

ఏపీలో సినిమా టికెట్లను ఆన్ లైన్ లో అమ్మే అంశానికి సంబంధించిన వివాదం మళ్లీ మొదటకొచ్చింది. ఏపీ ఫిల్మ్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ ద్వారా టికెట్లను అమ్మాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి సంబంధించి ఈ నెల 2న జీవో 69ని విడుదల చేసింది. టికెట్ల అమ్మకాలకు సంబంధించి నెల రోజుల్లో ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకోవాలని ఆదేశించింది. 

అయితే ఎంఓయూ పత్రాలను చూసిన థియేటర్ యజమానులు షాక్ కు గురవుతున్నారు. టికెట్లను ఆన్ లైన్ లో అమ్మకం  వరకు బాగానే ఉన్నప్పటికీ... టికెట్ల విక్రయాల తర్వాత థియేటర్లకు డబ్బు ఎప్పుడు జమ చేస్తారనే విషయాన్ని ఎంఓయూలో పేర్కొనకపోవడంతో వారు ఆందోళనకు గురవుతున్నారు. ఎంవోయూపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. 

ఫిలిం ఛాంబర్ ద్వారానే ఆన్ లైన్ లో టికెట్ల విక్రయాలను జరుపుతామని ఎగ్జిబిటర్లు కోరారు. మరోవైపు ఎంవోయూపై సంతకం పెడితే ప్రభుత్వం చేతుల్లో చిక్కుకున్నట్టేనని వారు ఆందోళన చెందుతున్నారు. ఇంకో విషయం ఏమిటంటే... జులై 2లోగా ఎంవోయూలపై సంతకాలు చేయకపోతే థియేటర్ల లైసెన్స్ రద్దు చేస్తామని ప్రభుత్వం హెచ్చరించింది. 

థియేటర్లు మూసివేసేందుకు కూడా సిద్ధమేనని అయినప్పటికీ సంతకాలు చేయబోమని,  థియేటర్ యజమానులు అంటున్నారు. ఈ నేపథ్యంలో ఎగ్జిబిటర్ల ఆందోళనను, అభ్యంతరాలను వ్యక్తం చేస్తూ సీఎం జగన్ కు ఫిలిం ఛాంబర్ లేఖ రాసింది. మరి ఈ వివాదం ఏమలుపు తిరుగుతుందో వేచి చూడాల్సింది. 

PREV
click me!

Recommended Stories

Krishnam Raju: చిరంజీవి ఇలా మనసు పడ్డాడో లేదో, మెడలో ఖరీదైన గిఫ్ట్ పెట్టిన కృష్ణంరాజు.. మర్చిపోలేని బర్త్ డే
మడత మంచం పై పడుకొని, ప్రకృతిని ఆస్వాదిస్తున్న అనసూయ