అభిమానులను బాధ పెట్టే అనుష్క నిర్ణయం!

By Udayavani DhuliFirst Published Dec 12, 2018, 1:57 PM IST
Highlights

దక్షిణాది అగ్ర హీరోయిన్ గా తన సత్తా చాటుతోంది అనుష్క. సినిమాకి రెండు నుండి మూడు కోట్ల రెమ్యునరేషన్ తీసుకునే అతి తక్కువ మంది సౌత్ హీరోయిన్లలో అనుష్క ఒకరు

దక్షిణాది అగ్ర హీరోయిన్ గా తన సత్తా చాటుతోంది అనుష్క. సినిమాకి రెండు నుండి మూడు కోట్ల రెమ్యునరేషన్ తీసుకునే అతి తక్కువ మంది సౌత్ హీరోయిన్లలో అనుష్క ఒకరు. 'బాహుబలి' సినిమా తరువాత ఆమె క్రేజ్ మరింతగా పెరిగిపోయింది.

ఆ సినిమా తరువాత 'భాగమతి' తప్ప అనుష్క నుండి మరో సినిమా విడుదల కాలేదు. ఏడాది కనీసం రెండు, మూడు సినిమాలతో బిజీగా ఉండే అనుష్క ఇకపై ఏడాది ఒక సినిమా మాత్రమే చేయాలని భావిస్తుందట.

బాహుబలితో వచ్చిన క్రేజ్ ని కొనసాగించడానికి రెగ్యులర్ కమర్షియల్ సినిమాల్లో నటిస్తే సరిపోదని సరికొత్త పాత్రలతో ప్రేక్షకుల ముందుకు రావాలని నిర్ణయించుకుందట. ఏడాదికి ఒక సినిమా మాత్రమే అంటే అనుష్క అభిమానులను బాధ పెట్టే విషయమే కానీ అమ్మడు మాత్రం వచ్చిన సినిమాలన్నీ చేయకూడదని డిసైడ్ చేసుకుందట.

ప్రస్తుతం అనుష్క.. మాధవన్ హీరోగా 'వస్తాడు నా రాజు' ఫేం హేమంత్ మధుకర్ దర్శకత్వంలోరూపొందనున్న సినిమాలో హీరోయిన్ గా నటించనుంది. వచ్చే ఏడాదిలో ఈ సినిమా  సెట్స్ పైకి వెళ్లనుంది. ఆ తరువాత ఏ సినిమా అనౌన్స్ చేస్తుందో చూడాలి!

click me!