సుకుమార్ ఇంకో రెండు ఆగిపోయాయా? ఏం జరుగుతోంది!

By Udaya DFirst Published Apr 3, 2019, 11:21 AM IST
Highlights

సూపర్ టాలెంటెడ్ డైరక్టర్ గా పేరు తెచ్చుకున్న సుకుమార్ ...బ్యాడ్ టైమ్ కంటిన్యూ అవుతోంది. 

సూపర్ టాలెంటెడ్ డైరక్టర్ గా పేరు తెచ్చుకున్న సుకుమార్ ...బ్యాడ్ టైమ్ కంటిన్యూ అవుతోంది. రంగస్దలం వంటి బ్లాక్ బస్టర్ ఇచ్చాక కూడా ఆయన నెక్ట్స్ చిత్రం ప్రారంభించలేని పరిస్దితి ఏర్పడింది. సరే అని ఆయన తన సొంత బ్యానర్ లో సినిమాలు ప్రారంభిస్తే అవీ ఆగిపోతున్నాయని వినికిడి. 

తన సుకుమార్ రైటింగ్స్ బ్యానర్స్ పై ఆయన ఆరు సినిమాలు ప్లాన్ చేసి వాటితో వివిధ టీమ్ లతో కలిసి పనిచేస్తున్నారు సుకుమార్. అందులో నితిన్, సూర్య ప్రతాప్ కాంబినేషన్ లో గీతా ఆర్ట్స్, సుకుమార్ రైటింగ్స్ ఒకటి. ఆ ప్రాజెక్టు నితిన్ డేట్స్  కేటాయించలేను అని తేల్చటంతో ఆగిపోయింది. 

అలాగే నాగశౌర్య హీరోగా  శరద్ మరార్ తో సుకుమార్ రైటింగ్స్  కలిపి కాశీ విశాల్ దర్శకత్వంలో చేసే చిత్రం సైతం ఆగిపోయినట్లు తెలుస్తోంది. ఇక్కడ ఎందుకు ప్రాజెక్టు ఆగిందనే విషయం తెలియరాలేదు. ఇక మైత్రీ మూవీస్ తో ఎగ్రిమెంట్ చేసుకున్న మూడు సినిమాలు ఉన్నాయి. వాటిల్లో ఒకటి వైష్ణవ్ తేజ తో ఎనౌన్స్ అయ్యింది. వచ్చే నెలలో ఆ సినిమా స్టార్ట్ చేస్తారు. ఇక మిగిలిన సినిమాల సంగతి తేలాల్సి ఉంది. 

అందుతున్న సమాచారం మేరకు సుకుమార్ ప్రస్తుతం అల్లు అర్జున్ తో తను చేయబోయే చిత్రం స్క్రిప్టు  పనిలో బిజీగా ఉన్నారు. మహేష్ తో అనుకున్న ప్రాజెక్టు కాన్సిల్ అవటంతో ఈ సినిమాతో ఎలాగైనా బిగ్గెస్ట్ హిట్ ఇవ్వాలని సుకుమార్ అన్ని జాగ్రత్తలు తీసుకుని ముందుకు వెళ్తున్నట్లు సమాచారం. 

click me!