మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో దర్శకుడు సురేందర్ రెడ్డి 'సై రా నరసింహారెడ్డి' సినిమాను రూపొందిస్తోన్న సంగతి తెలిసిందే. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో ఇప్పటికే తమన్నా, అమితాబ్ బచ్చన్, సుదీప్, విజయ్ సేతుపతి వంటి తారలు నటిస్తున్నారు.
మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో దర్శకుడు సురేందర్ రెడ్డి 'సై రా నరసింహారెడ్డి' సినిమాను రూపొందిస్తోన్న సంగతి తెలిసిందే. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో ఇప్పటికే తమన్నా, అమితాబ్ బచ్చన్, సుదీప్, విజయ్ సేతుపతి వంటి తారలు నటిస్తున్నారు.
మెగా డాటర్ నీహారిక కొణిదెల కూడా కనిపించబోతుందని సమాచారం. భారీ బడ్జెట్ తో సినిమాను రూపొందిస్తోన్న రామ్ చరణ్ కూడా ఈ సినిమాలో అతిథి పాత్రలో కనిపిస్తాడని అంటున్నారు. ఇప్పుడు మరో మెగాహీరోకి ఈ సినిమాలో ఛాన్స్ వచ్చినట్లు తెలుస్తోంది.
కథ ప్రకారం సినిమాలో ఓ కీలమైన పాత్రను ఎవరైనా మెగాహీరోతో చేయిస్తే బాగుంటుందని యూనిట్ భావిస్తోందట. ఈ మేరకు మెగా క్యాంప్ హీరోలతో చర్చలు కూడా మొదలైనట్లు తెలుస్తోంది.
చిరంజీవి సినిమా, పైగా చరణ్ నిర్మాత కాబట్టి ఏ మెగా హీరో ఈ ఛాన్స్ మిస్ చేసుకోడు. అయితే ఎవరిని ఫైనల్ చేయబోతున్నారనే విషయంలో ఇంకా క్లారిటీ రాలేదు. ఈ విషయాన్ని సర్ప్రైజింగ్ ఎలిమెంట్ గానే ఉంచాలని అనుకుంటున్నారు.