కుమార్తెతో కలసి ఆసుపత్రికి వెళ్లిన బిగ్ బి.. అభిషేక్ కోసమే, బలమైన గాయమా ?

By telugu teamFirst Published Aug 23, 2021, 5:20 PM IST
Highlights

బిగ్ బి అమితాబ్ బచ్చన్ తన కుమార్తె శ్వేతా బచ్చన్ తో కలసి హాస్పిటల్ కు వెళ్లిన దృశ్యాలు వైరల్ గా మారాయి. అమితాబ్, శ్వేతా బచ్చన్ ముంబైలోని లీలావతి ఆసుపత్రి బయట ఉండగా ఫొటోగ్రాఫర్ల కెమెరాలు క్లిక్ మన్నాయి. 

బిగ్ బి అమితాబ్ బచ్చన్ తన కుమార్తె శ్వేతా బచ్చన్ తో కలసి హాస్పిటల్ కు వెళ్లిన దృశ్యాలు వైరల్ గా మారాయి. అమితాబ్, శ్వేతా బచ్చన్ ముంబైలోని లీలావతి ఆసుపత్రి బయట ఉండగా ఫొటోగ్రాఫర్ల కెమెరాలు క్లిక్ మన్నాయి. 

కొన్ని రోజుల క్రితమే అభిషేక్ బచ్చన్ గాయపడ్డ సంగతి తెలిసిందే. కానీ బచ్చన్ ఫ్యామిలీ మాత్రం ఈ విషయం గురించి అధికారికంగా స్పందించలేదు. ప్రస్తుతం అభిషేక్ బచ్చన్ లీలావతి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. 

అభిషేక్ బచ్చన్ కొన్ని రోజుల క్రితం ఒత్త సెరప్పు సైజు 7 రీమేక్ చిత్ర షూటింగ్ లో గాయపడ్డాడు. అభిషేక్ కుడి చేతికి గాయం అయింది. చేతికి కట్టు, బ్యాండేజ్ లతో ఇటీవల ఆసుపత్రి బయట అభిషేక్, ఐశ్వర్య కనిపించిన సంగతి తెలిసిందే. అభిషేక్ కి గాయం కావడంతో పొన్నియన్ సెల్వన్ షూటింగ్ లో ఉన్న ఐశ్వర్యరాయ్ ముంబైకి చేరుకుంది. 

చేతికి గాయం కావడంతో వైద్యులు అభిషేక్ కు విశ్రాంతి సూచించినట్లు సమాచారం. అభిషేక్ కి శస్త్ర చికిత్స ఏమైనా చేశారా అనేది తెలియాల్సి ఉంది. అభిషేక్ చేతికి బలమైన గాయం తగిలిందా, తీవ్రత ఎంత అనే విషయాలపై ఎవరూ అధికారికంగా స్పందించలేదు.  అమితాబ్ కుర్తా ఫైజామా ధరించి తన కుమార్తె కలసి కొడుకుని చూసేందుకు ఆసుపత్రికి వెళ్లారు. 

ఇదిలా ఉండగా ఐశ్వర్యారాయ్ మణిరత్నం పొన్నియన్ సెల్వం చిత్రంలో కీలక పాత్రలో నటిస్తోంది. ఇక అభిషేక్ ఒత్త సెరప్పు సైజు 7 హిందీ రీమేక్ లో నటిస్తున్నాడు. ఈ చిత్ర తెలుగు రీమేక్ లో బండ్ల గణేష్ నటిస్తుండడం విశేషం. తమిళంలో పార్తిబన్ నటించిన ఈ మూవీ 2019లో ఘనవిజయం అందుకుంది. 

click me!