Allu Arjun: షాకిస్తున్న `పుష్ప` ప్రీ రిలీజ్‌ బిజినెస్‌.. తగ్గేదెలే అనిపిస్తుందిగా..

By Aithagoni RajuFirst Published Dec 11, 2021, 6:11 PM IST
Highlights

ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ నటిస్తున్న `పుష్ప` సినిమా బిజినెస్‌ షాకిస్తుంది. ఈ నెల 17న సినిమా విడుదల కానున్న నేపథ్యంలో తాజాగా బయటకొచ్చిన ప్రీ రిలీజ్‌ బిజినెస్‌ ట్రేడ్‌ వర్గాలను ఆశ్చర్యానికి గురి చేస్తుంది.

ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌(Allu Arjun) `అల వైకుంఠపురములో` చిత్రంతో భారీ మార్కెట్‌ని క్రియేట్‌ చేసుకున్నారు. ఈ సినిమా దాదాపు రెండు వందల కోట్లకి పైగా కలెక్షన్లని రాబట్టింది. నాన్‌ `బాహుబలి` రికార్డ్ లను తిరగరాసింది. ఈ సినమాతో అల్లు అర్జున్‌కి నేషనల్‌ వైడ్‌గా మార్కెట్‌ ఏర్పడింది. దీంతో లేటెస్ట్ గా ఆయన నటిస్తున్న `పుష్ప`(Pushpa) చిత్రాన్ని పాన్‌ ఇండియా సినిమాగా తెరకెక్కించారు. సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా రెండు భాగాలుగా రూపొందుతుంది. మొదటి భాగం `పుష్పః ది రైజ్‌` ఈ నెల(డిసెంబర్‌) 17న తెలుగుతోపాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదల కాబోతుంది. 

ఇదిలా సినిమా బిజినెస్‌ భారీగా జరిగినట్టు తెలుస్తుంది. ఊహించని విధంగా ఈ సినిమా ప్రీ బిజినెస్‌ జరిగిందని టాక్‌. ఏకంగా రూ. 250కోట్ల ప్రీ రిలీజ్‌ బిజినెస్‌ జరిగిందనే వార్త ఇప్పుడు ఇంటర్నెట్‌లో వైరల్‌ అవుతుంది. `అల వైకుంఠపురములో` చిత్రంతో భారీ మార్కెట్‌ క్రియేట్‌ అయిన నేపథ్యంలో బన్నీ జోరుని దృష్టిలో పెట్టుకుని పలు డిస్ట్రిబ్యూషన్‌ సంస్థలు ఎగబడి Pushpa రైట్స్ దక్కించుకుంటున్నట్టు సమాచారం.  అన్ని ఏరియాల్లో ఫ్యాన్సీ రేటుకి అమ్ముడు పోయిందని టాక్‌. `ఆర్య`, `ఆర్య2` వంటి విజయవంతమైన సినిమాల తర్వాత అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్‌లో వస్తోన్న సినిమా కావడంతో దీనికి ముందుగానే మార్కెట్‌లో హైప్‌ పెరిగింది. 

బన్నీ-సుకుమార్‌ కాంబినేషన్‌కి హ్యాట్రిక్ మూవీ కావ‌డంతో ప్రీ రిలీజ్ ట్రేడ్ కి అనూహ్య స్పంద‌న‌ వస్తుందని ఇంటర్నెట్‌లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. తెలుగు, త‌మిళ‌, మ‌ళ‌యాలం, క‌న్న‌డ‌, హిందీ భాష‌ల్లో థియేట్రిక‌ల్, అలానే నాన్ థియేట్రిక‌ల్ (ఓటిటి, డిజిటిల్ రైట్స్) క‌లుపుకొని 250 కోట్లుకు రిలీజ్ కి ముందే బిజినెస్ ద‌క్కించుకున్న ట్రేడ్‌ వర్గాలు అంటున్నారు. దీంతో బిజినెస్‌ పరంగానూ సినిమా తగ్గేదెలే అని నిరూపిస్తుంది.  బన్నీ సరసన రష్మిక మందన్నా కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. 

ఇక ఈ చిత్రంలో సమంత ఐటెమ్‌ సాంగ్‌ చేస్తుంది. ఆమె కెరీర్‌లో ఫస్ట్ టైమ్‌ ఐటమ్‌ సాంగ్‌ చేయడం కూడా సినిమాపై క్రేజ్‌ పెరగడానికి కారణమని చెప్పొచ్చు. శుక్రవారం విడుదలైన `ఊ అంటవా మావ.. ఉ ఉ అంటావా.. `అంటూ సాగే మాస్‌ బీట్‌ అదరగొడుతుంది. యూట్యూబ్‌లో ట్రెండ్‌ అవుతుంది. మాస్‌ ఆడియెన్స్ కి పిచ్చెక్కిస్తుంది. ఈ పాట జస్ట్ లిరికల్‌ వీడియోనే ఈ రేంజ్‌లో ఊపేస్తుంటే, ఇక సినిమాలో సమంత గ్లామర్‌ స్టెప్పులకు అభిమానులు ఊగిపోవడం ఖాయమని ఆశాభావం వ్యక్తం చేస్తుంది యూనిట్‌. ఈ పాట కేవలం 24గంటల్లోనే 12 మిలియన్స్ వ్యూస్‌ని దక్కించుకోవడం విశేషం. మరోవైపు ఈ సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ రేపు(ఆదివారం) హైదరాబాద్‌లో గ్రాండ్‌గా నిర్వహించబోతున్నారు.

also read: Pushpa: సమంత ఐటమ్ సాంగ్ పై దుమ్మెత్తిపోస్తున్న నెటిజన్లు.. పాట మొత్తం బూతులు

click me!