ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చివరగా `పుష్ప 2`తో సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఇప్పుడు అట్లీతో మూవీ చేయబోతున్నారు. ఈ క్రమంలో బన్నీ తాజాగా ముంబాయిలో జరుగుతున్న `వేవ్ 2025 సమ్మిట్`లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా చిరంజీవిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
మెగా ఫ్యామిలీ, అల్లు ఫ్యామిలీ మధ్య గత కొన్ని రోజులుగా వివాదం నడుస్తున్న విషయం తెలిసిందే. ఏపీ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్కి సపోర్ట్ గా ఎన్నికల ప్రచారంలో పాల్గొనకుండా వైసీపీ ఎమ్మెల్యే కోసం ప్రచారంలో పాల్గొనడంతో ఈ వివాదం షురూ అయ్యింది. అది కాస్త రెండు కుటుంబాల వివాదంగా మారింది. ఈ క్రమంలో ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవిపై అల్లు అర్జున్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
ముంబయిలో వేవ్ 2025 సమ్మిట్లో సినీ ప్రముఖులంతా పాల్గొంటున్న విషయం తెలిసిందే. చిరంజీవి, రజనీకాంత్, అక్షయ్ కుమార్, షారూఖ్ ఖాన్, రణ్ బీర్ కపూర్, నాగార్జున ఇలా చాలా మంది ప్రముఖులు పాల్గొని తమ అభిప్రాయాలు వెల్లడించారు. ఈ క్రమంలో ఇందులో అల్లు అర్జున్ కూడా పాల్గొన్నారు.
ఆయన ప్రత్యేకంగా చిట్చాట్లో పాల్గొనడం విశేషం. ఈ సందర్భంగా అల్లు అర్జున్.. తన మామయ్య చిరంజీవి గురించి వెల్లడించారు. తాను ఈ స్థాయికి కారణం చిరంజీవి అని తెలిపారు. తనకు నటుడిగా బిగ్గెస్ట్ ఇన్స్పిరేషన్ చిరంజీవి అని, ఆయనే తనని ఎంతో ప్రభావితం చేశారని తెలిపారు.
`మెగా` వివాదం వేళ బన్నీ వ్యాఖ్యలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి. తమ మధ్య వివాదం లేదనే విషయాన్ని అల్లు అర్జున్ చెప్పకనే చెప్పారు. ఇక ఈ సందర్భంగా మరో ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు. తనకు డాన్స్ స్వతహాగా వచ్చిందని, ఎవరి దగ్గర నేర్చుకోలేదని తెలిపారు. సెల్ఫ్ గానే తాను మంచి డాన్సర్ని అని, ఆ తర్వాత ట్రైనర్స్ సహాయంతో ఇంకా బాగా మౌల్డ్ అయినట్టు చెప్పాడు బన్నీ.
తన జీవితంలోని స్ట్రగుల్స్ చెబుతూ, తన 18వ సినిమా ఫ్లాప్ సమయంలో చాలా ఇబ్బంది పడ్డట్టు తెలిపారు. ఆ సమయంలో బాగా ఆలోచించానని, తనని తాను ఆత్మవిమర్శ చేసుకుని కెరీర్ని అనలైజ్ చేసుకుని ముందుకు వెళ్లినట్టు తెలిపారు. ఆ సమయంలో తన గురించి చాలా మంది రకరకాలుగా మాట్లాడుకున్నారని వెల్లడించారు.
అయితే ఆ ఏడాది తాను చాలా నేర్చుకున్నానని, అంతకు ముందు తన గురించి ఎవరు ఏం మాట్లాడుకుంటున్నారో తెలియలేదు, ఆ తర్వాత అందరి మాటలు విన్నాను. వారినుంచి ఏదో ఒకటి నేర్చుకునే విషయం ఉందనిపించింది. దీంతో ఇకపై తాను చేసే సినిమా అందరు మాట్లాడుకునేలా ఉండాలని భావించి చేసినట్టు తెలిపారు. ఆ సమయంలో బన్నీ `అల వైకుంఠపురములో` సినిమాతో బిగ్గెస్ట్ హిట్ అందుకున్న విషయం తెలిసిందే.
అట్లీ సినిమా గురించి చెబుతూ, ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ లో ఈ మూవీ ఉంటుందని తెలిపారు. ఇండియన్ మూవీస్లోనే ఇలాంటి మూవీ రాలేదు. ఒక గొప్ప సినిమాని చూడబోతున్నారని, ఇండియా సెన్సిబులిటీస్తో ఉండే ఇంటర్నేషనల్ మూవీ అని తెలిపారు బన్నీ. అట్లీతో కలిసి ఈ మూవీ చేయడం పట్ల చాలా సంతోషంగా ఉన్నట్టు వెల్లడించారు బన్నీ.