బాలయ్య ..దసరాకు రావటం కష్టమా? లేటెస్ట్ బజ్ ఇదీ

By Surya PrakashFirst Published Aug 25, 2021, 7:41 AM IST
Highlights


బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘అఖండ’ షూటింగ్ కొన్నాళ్లుగా శరవేగంగా సాగుతోంది. సోమవారం వరకు రామోజీ ఫిలింసిటీలో కీలక సన్నివేశాల్ని తెరకెక్కించారు. మంగళవారంతో టాకీభాగం సన్నివేశాల్ని పూర్తి చేశారు. రెండు పాటలు మాత్రమే తెరకెక్కించాల్సి ఉందని సినీ వర్గాలు తెలిపాయి

దసరాకి బాలయ్య హంగామా చేయబోతున్నారంటూ గత కొద్ది రోజులుగా మీడియాలో వినిపిస్తోంది. అఫీషియల్ గా ప్రకటన రాకపోయినా నందమూరి ఫ్యాన్స్ దసరాకు తమ అభిమాన హీరోని థియోటర్ లో చూడబోతున్నామని ఫిక్సై పోయారు. మరోప్రక్క బాలయ్య జోరు చూస్తుంటే ఖాయమనే అనిపిస్తున్నా కష్టమే అంటున్నారు. 

రాజమౌళి ఆర్ ఆర్ ఆర్ చిత్రం దసరా నుంచి ప్రక్కకు వెళ్లిపోయింది. కొత్త డేట్ ఇంకా క్లారిటీ గా తెలియటం లేదు. దాంతో అందరూ బాలయ్య  ‘అఖండ’  చిత్రం అక్టోబర్ 8న థియేటర్లలోకి దిగుతుందని అంచనా వేసారు. అయితే అందుతున్న సమాచారం ప్రకారం రెండు పాటలు మినహా షూటింగ్ పూర్తైపోయింది. కానీ పోస్ట్ ప్రొడక్షన్ బాగా లేటవుతోంది. ముఖ్యంగా విఎఫ్ ఎక్స్ వర్క్ ఇంకా పూర్తి కాలేదు. ఇంటర్వెల్ సీన్ లో వచ్చే సీన్ లో విఎఫ్ ఎక్స్ వర్క్ కు బాగా ఎక్కువ అవసరం ఉందిట. బోయపాటి ఆల్రెడీ ఓ వెర్షన్ చూసి నచ్చక మార్పులు చేయిస్తున్నారని వినికిడి. దాంతో పోస్ట్ ప్రొడక్షన్ ఫినిష్ అయితేనే సెప్టెంబర్ లో వస్తుంది. లేకపోతే డిసెంబర్ లోనే. తమన్ కంపోజ్ చేసిన పాటను నెక్ట్స్ మంత్ లో రిలీజ్ చేసే ప్లాన్ లో ఉంది టీమ్.
 
బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘అఖండ’ షూటింగ్ కొన్నాళ్లుగా శరవేగంగా సాగుతోంది. సోమవారం వరకు రామోజీ ఫిలింసిటీలో కీలక సన్నివేశాల్ని తెరకెక్కించారు. మంగళవారంతో టాకీభాగం సన్నివేశాల్ని పూర్తి చేశారు. రెండు పాటలు మాత్రమే తెరకెక్కించాల్సి ఉందని సినీ వర్గాలు తెలిపాయి. మరోపక్క పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు కూడా శరవేగంగా సాగుతున్నాయి.  బాలకృష్ణ - బోయపాటి శ్రీను కలయికలో రూపొందుతున్న మూడో చిత్రమిది. విజయవంతమైన ‘సింహా’, ‘లెజెండ్‌’ తర్వాత వస్తున్న సినిమా కావడంతో అభిమానులు మరింత ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ఇందులో బాలయ్య రెండు పాత్రల్లో సందడి చేస్తారు. ఆయనకి జోడీగా ప్రగ్యా జైశ్వాల్‌, పూర్ణ నటించారు. మిర్యాల రవీందర్‌రెడ్డి నిర్మాత.

click me!