విక్రమ్ సినిమాలో చేయడం నాకిష్టం లేదు.. హీరోయిన్ కామెంట్స్!

Published : May 20, 2019, 09:40 AM IST
విక్రమ్ సినిమాలో చేయడం నాకిష్టం లేదు.. హీరోయిన్ కామెంట్స్!

సారాంశం

తమిళ హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ వరుస అవకాశాలతో బిజీగా గడుపుతోంది. 

తమిళ హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ వరుస అవకాశాలతో బిజీగా గడుపుతోంది. మొదటి నుండి కూడా సరికొత్త కథలను ఎన్నుకుంటూ నటిగా దూసుకుపోతుంది. త్వరలోనే విజయ్ దేవరకొండ సినిమాతో తెలుగులో అరంగేట్రం చేయనుంది. 

క్రాంతి మాధవ్ ఈ సినిమాను డైరెక్ట్ చేయనున్నారు. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఐశ్వర్య చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. విక్రమ్ తో కలిసి ఆమె 'సామి 2' సినిమాలో నటించింది. హరి డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో కీర్తి సురేష్ మెయిన్ హీరోయిన్ గా నటించింది. 

అయితే అందులో నటించడం తనకు ఇష్టం లేదని అన్నారు ఐశ్వర్య. అలాంటి పాత్ర చేయడం తనకు ఇష్టం లేదని, వ్యక్తిగతంగా కోరడం వలన తప్పక చేయాల్సి వచ్చిందని అన్నారు. ఆ పాత్రలో నటించడానికి ఎవరూ అంగీకరించలేదని చెప్పారు.

కేవలమ రెండు పాటలు, రొమాంటిక్ సన్నివేశాలకు పరిమితం కావాలని అనుకోవడం లేదని.. అలాంటి చిత్రాల్లో నేను చేయను అంటూ చెప్పుకొచ్చింది. 

PREV
click me!

Recommended Stories

Karthika Deepam 2 Today Episode: దీపను దారుణంగా అవమానించిన జ్యో- దీప, CEO పోటీ నుంచి తప్పుకుంటుందా?
Jr NTR House: జూనియర్ ఎన్టీఆర్ ఇంద్రభవనం గురించి తెలుసా.. 25 కోట్లతో డ్రీమ్ హౌస్ నిర్మించుకున్న యంగ్ టైగర్