బాలీవుడ్ స్టార్ అమితాబచన్ కోడలు, హీరోయిన్ ఐశ్వర్యారాయ్ కారు రోడ్డు ప్రమాదానికి గురయ్యింది.
Aishwarya Rai : ప్రముఖ సినీనటి ఐశ్వర్యారాయ్ కారు ప్రమాదానికి గురయ్యింది. ఇవాళ(బుధవారం) ముంబైలో ఈ ప్రమాదం జరిగింది. ఐశ్వర్యారాయ్ కి చెందిన లగ్జరీ కారును బస్సు ఢీకొట్టింది. దీంతో కారు వెనకబాగం దెబ్బతింది.
అయితే ఈ సమయంలో ఐశ్వర్యారాయ్ లేదా బచ్చన్ ఫ్యామిలీకి చెందిన ఇంకెవరైనా కారులో ఉన్నారా? వారికేమైనా గాయాలయ్యాయా? అన్నది తెలియాల్సి ఉంది. ఈ ప్రమాదంలో తప్పు ఎవరిదో కూడా తెలియాల్సి ఉంది. ప్రమాదానికి గురయిన కారు దాదాపు కోటి రూపాయలకు పైనే ఉంటుంది.
వెనకనుండి వచ్చిన బస్సు కారును ఢీకొట్టింది. ప్రమాదం జరిగినవెంటనే చుట్టుపక్కలవారు అక్కడ గుమిగూడారు. అక్కడ ఐశ్వర్యారాయ్ లేదా బచ్చన్ కుటుంబసభ్యులు కనిపించలేదు. అంటే కారులో ఎవరూ లేరా? లేదంటే జనాలు గుమిగూడేసరికి వేరే వాహనంలో అక్కడినుండి వెళ్ళిపోయారా? అన్నది తెలియాల్సి ఉంది.
ఈ ప్రమాదంపై ఎవరూ తమకు ఫిర్యాదు చేయలేదని పోలీసులు చెబుతున్నారు. ప్రమాద స్థలం నుండి బస్సుతో పాటు కారును కూడా ఎవరికివారు తీసుకెళ్ళారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది.
ఐశ్వర్యారాయ్ ఉపయోగించే టయోటా వెల్ ఫైర్ కారు విఐపి ల భద్రత, సౌకర్యాలను దృష్టిలో ఉంచుకుని రూపొందించారు. దీని ధర రూ.1.30 లక్షలు ఉంటుంది. గతేడాదే మాజీ ప్రపంచ సుందరి, బాలీవుడ్ హీరోయిన్ ఐశ్వర్యారాయ్ ఈ కారును కొనుగోలు చేసారు.
ఈ టయోటా వెల్ఫైర్ కారు మరికొందరు బాలీవుడ్ స్టార్స్ వద్దకూడా ఉంది. ఐశ్వర్యా భర్త అభిషేక్ భచ్చన్ వద్ద కూడా ఇలాంటి కారు ఉంది. అలాగే అక్షయ్ కుమార్, అజయ్ దేవగన్, సంజయ్ కపూర్, రాకేష్ రోషన్ వద్ద కూడా ఈ మోడల్ కార్లు ఉన్నాయి.