Mahesh Babu: విదేశాలకు చెక్కేస్తున్న మహేష్!

By Sambi ReddyFirst Published May 22, 2022, 7:54 PM IST
Highlights

సూపర్ స్టార్ మహేష్ సమ్మర్ వెకేషన్ కి చెక్కేస్తున్నారు. భార్యా పిల్లలతో పాటు విదేశీయానం చేస్తున్నారు. సర్కారు వారి పాట బ్లాక్ బస్టర్ సక్సెస్ నేపథ్యంలో జాలీగా ఎంజాయ్ చేయాలని నిర్ణయించుకున్నారు. 
 

మహేష్ (Mahesh Babu)కి సినిమా తర్వాత కుటుంబమే ప్రపంచం. తన ఖాళీ సమయం భార్య పిల్లకు కేటాయిస్తారు. అలాగే క్రమం తప్పకుండా ఫ్యామిలీతో పాటు ప్రపంచం తిరిగొస్తూ ఉంటారు. లేటెస్ట్ గా మహేష్ సమ్మర్ వెకేషన్ ప్లాన్ చేశారు. భార్య నమ్రత, పిల్లలు గౌతమ్, సితారలతో పాటు విదేశాలకు వెళుతున్నారు. వెకేషన్ కి వెళుతున్న మహేష్ హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ లో కనిపించారు. ఇక ఇది లాంగ్ ట్రిప్ అని తెలుస్తుంది. సర్కారు వారి పాట ప్రమోషన్స్ లో బిజీగా గడిపిన మహేష్ వెకేషన్ తో సేద తీరాలని డిసైడ్ అయ్యారు. 

మహేష్ నెక్స్ట్ దర్శకుడు త్రివిక్రమ్ తో మూవీ చేయనున్నారు. మహేష్ 28వ చిత్రంగా తెరకెక్కనున్న ఈ మూవీ త్వరలో సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ గ్యాప్ లో ఆయన ఈ వెకేషన్ ప్లాన్ చేశారు. ప్రతి సినిమా షూటింగ్ కి ముందు, విడుదల తర్వాత మహేష్ తప్పనిసరిగా టూర్ కి వెళతారు. ఇది ఆ కుటుంబంలో ఓ ఆనవాయితీగా ఉంది. ఇక త్రివిక్రమ్ మూవీపై పరిశ్రమలో పాజిటివ్ బజ్ ఉంది. ఈ మూవీలో మహేష్ కి జంటగా పూజా హెగ్డే నటిస్తున్నారు. 

Superstar off to a family holiday ✈️ pic.twitter.com/uVmDQEu7un

— #BlockbusterSVP 🌟 (@SSMBSpace)

కాగా ఆ తదుపరి మహేష్ దర్శకుడు రాజమౌళితో చేయాల్సి ఉంది. ఈ ప్రాజెక్ట్ స్క్రిప్ట్ దశలో ఉంది. వచ్చే ఏడాది సెట్స్ పైకి వెళ్లనున్న ఈ చిత్రం భారీ ఎత్తున పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది. ఇది యాక్షన్ అండ్ అడ్వెంచర్ మూవీగా తెలుస్తుంది. రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్ కథ సమకూరుస్తున్నారు. 

ఇక మహేష్ లేటెస్ట్ సెన్సేషన్ సర్కారు వారి పాట (Sarkaru Vaari Paata)మంచి విజయం అందుకుంది. ఈ మూవీ వరల్డ్ వైడ్ గా రూ. 200 కోట్ల గ్రాస్ రాబట్టింది. యూఎస్ లో $2.3 మిలియన్ వసూళ్లు అందుకున్న సర్కారు వారి పాట.. మిక్స్డ్ టాక్ లో కూడా సత్తా చాటింది. దర్శకుడు పరుశురామ్ తెరకెక్కించిన సర్కారు వారి పాట చిత్రంలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించారు.  

click me!