Shruti Haasan : ‘వాల్తేరు వీరయ్య’ ప్రీరిలీజ్ ఈవెంట్ కు రాలేకపోతున్నాను.. కారణం ఏంటంటే?

By team teluguFirst Published Jan 8, 2023, 5:13 PM IST
Highlights

మెగాస్టార్‌ చిరంజీవి (Chiranjeevi) హీరోగా, రవితేజ కీలక పాత్రల్లో నటించిన చిత్రం ‘వాల్తేరు వీరయ్య’. చిరు సరసన శృతి హాసన్ ఆడిపాడింది. మరికొద్ది గంటల్లో జరగబోతున్న ప్రీ రిలీజ్ ఈవెంట్ కు శృతి రావల్లేదని తెలిపింది.
 

స్టార్ హీరోయిన్ శృతి హాసన్ (Shruti Haasan) టాలీవుడ్ లో భారీ చిత్రాల్లో నటిస్తూ ఫుల్ బిజీగా ఉంది. ప్రస్తుతం ఈ బ్యూటీ సంక్రాంతి కానుగా విడుదల కాబోతున్న ‘వాల్తేరు వీరయ్య’, వీరసింహారెడ్డి చిత్రాలతో అలరించబోతోంది. ఒకరోజు తేడాతో రిలీజ్ కాబోతున్న ఈ చిత్రాలను మేకర్స్ జోరుగా ప్రమోట్ చేస్తున్నారు. ఈ సందర్బంగా మొన్న Veera Simha Reddy ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఒంగోలులో గ్రాండ్ గా నిర్వహించాారు. ఈవెంట్ లో శృతి హాసన్ కూడా బ్లాక్ శారీలో హాజరై అందరినీ ఆకట్టుకుంది. స్టేజీపైనే డాన్స్ పెర్ఫామెన్స్ తో అదరగొట్టింది.

ఈరోజు Waltair Veerayya ప్రీ రిలీజ్ ఈవెంట్ ను వైజాగ్ లో నిర్వహించబోతున్న విషయం తెలిసిందే. వైజాగ్ ఏయూ కాలేజీ గ్రౌండ్స్ లో ఇప్పటికే ఏర్పాట్లు జరుగుతున్నాయి. మరికొద్ది గంటల్లో ఈవెంట్ ప్రారంభం కానుంది. కార్యక్రమానికి చిత్ర యూనిట్ తో పాటు మెగాస్టార్ చిరంజీవి, రవితేజ, దర్శకుడు బాబీ కూడా హాజరుకాబోతున్నారు. ఈ క్రమంలో గ్లామర్ బ్యూటీ శృతి హాసన్ కూడా రానుందని అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో ఈవెంట్ రావడం లేదంటూ శృతి తాజాగా ప్రకటించింది. అందుకు రీజన్ కూడా చెప్పింది.

ఇన్ స్టా స్టోరీలో కారణం తెలుపుతూ.. ‘నా అనారోగ్యం కారణంగా వాల్తేరు వీరయ్య ప్రీ రిలీజ్ ఈవెంట్ కు హాజరు కాలేకపోతున్నాను. అందుకు బాధాగా ఉంది. చాలా అనారోగ్యంతో ఉన్నారు. మెగాస్టార్ చిరంజీవి సరసన నటించినందుకు గర్వంగా ఉంది. సక్సెస్ ఫుల్ ఈవెంట్ కు హాజరు కాబోతున్న మా చిత్ర యూనిట్ మొత్తానికి విషెస్  తెలుపుతున్నారు. అలాగే నేను మిస్ అవుతుండటం విచారంగా ఉంది.’ అంటూ పేర్కొంది. ఇక మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రానికి బాబీ దర్శకత్వం వహించారు. శృతి హాసన్, కేథరిన్ థెరిస్సా హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఆయా పాత్రల్లో ప్రకాష్ రాజ్, బాబీ సింహా, జాన్ విజయ్, వెన్నెల కిషోర్, శ్రీనివాస్ రెడ్డి తదితరులు అలరించనున్నారు. దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. జనవరి 13న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

click me!