
అనుపమ్ ఖేర్, దర్శన్ కుమార్, మిథున్ చక్రవర్తి, పల్లవి జోషి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం `ది కాశ్మీర్ ఫైల్స్`(The Kashmir Files). వివేక్ అగ్నిహోత్రి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని తెలుగు, హిందీలో అభిషేక్ అగర్వాల్, వివేక్ అగ్నిహోత్రి, పల్లవి జోషి, జీ స్టూడియో నిర్మించారు. ఈసినిమా శుక్రవారం(మార్చి 11)న విడుదలైంది. తాజాగా ఈ సినిమాకి అన్ని వర్గాల నుంచి మంచి స్పందన లభిస్తుంది.
1990 దశకంలో కశ్మీర్లో జరిగిన దారుణ మారణ హింసాకాండని ఆధారంగా చేసుకుని దర్శకుడు వివేక్అగ్నిహోత్రి ఈ చిత్రాన్ని రూపొందించారు. 90వ దశకంలో కశ్మీర్ పండితులపై అక్కడి జిహాదిలు చేసిన ఊచకోతకు ప్రతిరూపమే ఈ సినిమా. 1990లో హిందు పండిత్స్ పై అప్పటి వరకు అక్కడే వారితో కలిసి మెలిసి తిరిగిన కొంత మంది వేరే మతానికి చెందిని వారు అక్కడ స్థానిక హిందూవుపై దారుణ మారణ కాండకు పాల్పడ్డారు. వారి ఆస్తులను స్వాధీనం చేసుకున్నారు. వారికి అక్కడ నిలువ నీడ లేకుండా చేసి స్వదేశంలోనే శరణార్ధులుగా మార్చేశారు. ఈ యదార్థ సంఘటనలో రూపొందిన ఈ సినిమా దేశ వ్యాప్తంగా అందరి మన్ననలు పొందుతోంది.
ఇటీల ప్రధాని మోడీ చిత్రం యూనిట్ ను ప్రశంసించిన విషయం తెలిసిందే. తాజాగా ది కాశ్మీర్ ఫైల్స్ మూవీపై నటి ప్రణీత సుభాష్ (Pranitha) కూడా స్పందించారు. మూవీ చూసిన తనను ఎమోషనల్ అవుతూ ఇన్ స్టాలో నోట్ రాసుకొచ్చింది. ‘ఇది ఒక పోస్ట్. 30 ఏళ్ల క్రితం కాశ్మీరీ పండిట్లు అనుభవించిన హృదయాన్ని కదిలించే నిజాన్ని తెలుసుకోవడానికి ప్రతి భారతీయ పౌరుడు ది కాశ్మీర్ ఫైల్స్ మూవీ తప్పక చూడాలి. సినిమా ముగింపు సన్నివేశాల్లో నా భర్త, నేను కన్నీళ్లు పెట్టుకున్నాం. దయచేసి మీరు ఇంకా చూడకపోతే చూడండి’ అంటూ పోస్ట్ చేసింది.