Mammootty: నటుడు మమ్ముట్టికి కరోనా.. ఆందోళనలో ఫ్యాన్స్!

By Sambi ReddyFirst Published Jan 16, 2022, 8:36 PM IST
Highlights


దాదాపు కరోనా (Corona virus)థర్డ్ వేవ్ సూచనలు కనిపిస్తున్నాయి. రోజుకు లక్షల్లో కరోనా కేసులు నమోదవుతున్నాయి. మరోవైపు చిత్ర ప్రముఖులు కరోనా బారినపడుతున్నారు. మాలీవుడ్ టాప్ మమ్ముట్టి తనకు కరోనా సోకినట్లు తెలియజేశారు. 

మమ్ముట్టి (Mammootty) తనకు కరోనా సోకినట్టు సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు. అన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. స్వల్ప జ్వరం మినహాయిస్తే ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఇంటిలోనే క్వారంటైన్ కావందాంతో పాటు చికిత్స తీసుకుంటున్నారు.అందరూ మాస్క్ ధరించండి. అందరూ క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నాను.. అంటూ సందేశం పోస్ట్ చేశారు. 

మమ్ముట్టికి కరోనా సోకిందన్న వార్త తెలుసుకున్న ఫ్యాన్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అలాగే ఆయన కరోనా నుండి త్వరగా కోలుకోవాలని సోషల్ మీడియాలో విషెస్ తెలియజేస్తున్నారు. 70ఏళ్ల మమ్ముట్టి ఫస్ట్ లాక్ డౌన్ సమయంలో సుదీర్ఘ కాలం ఇంటికే పరిమితం అయ్యారు. మూడు నెలలకు పైగా మమ్ముట్టి అసలు కనిపించలేదు. కరోనా విషయంలో ఆయన ఎంత జాగ్రత్తగా ఉంటారో చెప్పడానికి ఇది గొప్ప ఉదాహరణ. అయినప్పటికీ మమ్ముట్టి కరోనా బారిన పడ్డారు. 

మమ్ముట్టి త్వరలో ఓ నెట్ఫ్లిక్స్ సిరీస్ లో నటించనున్నారు. ఇక మమ్ముట్టి కుమారుడు దుల్కర్ సల్మాన్ సైతం హీరోగా సత్తా చాటుతున్నాడు. దుల్కర్ లేటెస్ట్ మూవీ కురుప్ భారీ విజయం సాధించింది. తెలుగులో కూడా సల్మాన్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నారు. 

ఇక రోజుల వ్యవధిలో వివిధ పరిశ్రమలకు చెందిన ప్రముఖులు కరోనా బారినపడ్డారు. సూపర్ స్టార్ మహేష్ (Mahesh babu)కి కరోనా సోకిన విషయం తెలిసిందే. ఆయన తిరిగి కోలుకున్నారు. అలాగే మంచు మనోజ్, మంచు లక్ష్మి, త్రిష, బండ్ల గణేష్ తదితరులు తమకు కరోనా సోకినట్టు వెల్లడించారు. నేడు ఏకంగా 2.71 లక్షల కేసులు నమోదు కావడం జరిగింది. 

click me!