
ఆది సాయికుమార్ మినిమమ్ గ్యారంటీ హీరోగా నిలిచారు. తక్కువ బడ్జెట్తో, మంచి కాన్సెప్ట్ ఉన్న సినిమాలు చేస్తూ హిట్ కొడుతున్నాడు. నిర్మాతలను సేఫ్లో ఉంచుతున్నాడు. అందుకే జయాపజయాలకు అతీతంగా సినిమా అవకాశాలను దక్కించుకుంటున్నాడు. వరుసగా ఏడాది రెండు మూడు సినిమాలతో అలరిస్తున్నాడు. తాజాగా ఆయన నటించిన చిత్రం `సీఎస్ఐ సనాతన్`. దర్శకుడు శివ శంకర్ దేవ్ రూపొందించిన ఈ చిత్రాన్ని చాగంటి ప్రొడక్షన్స్ బ్యానర్ లో సునిత సమర్పణలో అజయ్ శ్రీనివాస్ నిర్మించిన సినిమా `సిఎస్ఐ సనాతన్`. ఆది సాయికుమార్, మిషా నారంగ్, నందినీ రాయ్, వాసంతి, తారక్ పొన్నప్ప, అలీ రెజా, ఖయ్యూమ్ ప్రధాన పాత్రల్లో నటించారు. శుక్రవారం సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా బుధవారం ఈ చిత్ర ఈవెంట్ని నిర్వహించారు.
ఇందులో హీరో ఆది సాయికుమార్ మాట్లాడుతూ, `ఓ యేడాదిన్నర క్రితం దేవ్ నాకు ఈ కథ చెప్పినప్పుడు చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించింది. మామూలుగా ఇలాంటి కథలు మళయాలంలో చూస్తుంటాం. ఒక మంచి పాయింట్ తీసుకుని కంప్లీట్ గా దానిమీదే రన్ అయ్యే ఓ మంచి కంటెంట్ ఇది. తెలుగులో ఓ క్రైమ్ సీన్ పై ఖచ్చితంగా ఓ పాయింట్ చుట్టూ తిరిగే కథ తెలుగులో `సిఎస్ఐ సనాతన్` మొదటిది అనుకుంటున్నాను. ఇది నన్ను బాగా ఎగ్జైట్ చేసింది. అదే టైమ్ లో ప్రతి కామన్ మేన్ కనెక్ట్ అయ్యే కథ ఇది.
ఫైనాన్సియల్ క్రైమ్ చుట్టూ తిరుగుతుంది. సీన్ బై సీన్ బిల్డ్ అవుతుంది. దర్శకుడు చాలా డీటెయిల్డ్ గా ఈ కథను చెప్పాడు. ఈ మూవీ దేవ్ కు మంచి హిట్ ఇవ్వాలని.. అలాగే మా నిర్మాత శ్రీనివాస్ గారికి పెద్ద బ్రేక్ ఇవ్వాలని కోరుకుంటున్నాను. నా కో యాక్టర్స్ తో పాటు టెక్నీషియన్స్ అందరికీ ఆల్ ద బెస్ట్ చెబుతున్నాను. తారక్ పొన్నప్ప చాలామంచి పాత్ర చేశాడు. అలీ రెజా పాత్రా బావుంటుంది. ప్రేక్షకులు మంచి సినిమాలను ఆదరిస్తారు. మా సిఎస్ఐ సనాతన్ సినిమా మీ అందరినీ మెప్పిస్తుందని నమ్ముతున్నాను` అని అన్నారు.
దర్శకుడు శివశంకర్ దేవ్ మాట్లాడుతూ.. ‘ఈ కథ చెప్పినప్పుడు హీరో ఆదితో పాటు నిర్మాతలు కూడా చాలా బాగా ఎగ్జైట్ అయ్యారు. కొన్ని రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా ఈ కథ రాసుకోవడం జరిగింది. ఇప్పటికే మన దేశంలో ఇలాంటివి చాలా జరుతున్నాయి. ఈ కథ ద్వారా ఏది కరెక్ట్ ఏది రాంగ్ అనేది ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా చూస్తున్నారు అనే కోణం చూపించబోతున్నాము. అందువల్ల ఈ కథ మీ అందరికీ కనెక్ట్ అవుతుందని నమ్ముతున్నారు. చూసిన ఎవరూ డిజప్పాయింట్ కారు అని నమ్మకం చెప్పగలను. ఈ మూవీకి సంబంధించి సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికీ పేరు పేరునా ధన్యవాదాలు చెబుతున్నాను’అని చెప్పారు.
నిర్మాత అజయ్ శ్రీనివాస్ మాట్లాడుతూ, `ఆది అన్నకు ఈ కథ చెప్పగానే ఆయన చాలా ఎగ్జైట్ అయ్యారు. ఆయన ఎగ్జైట్మెంట్ చూసిన తర్వాత కథపై దర్శకుడు దేవ్ తో కలిసి ఇంకా హార్డ్ వర్క్ చేశాం. ఈ కథకు సంబంధించి ప్రతి డీటెయిలింగ్ కోసం స్టడీ చేశాం. మా కెమెరామేన్ శేఖర్ వర్క్ సినిమా చాలా పెద్ద ప్లస్ అవుతుంది. ఆర్ఆర్ సినిమాకే హైలెట్ గా నిలవబోతోంది. ఈ సినిమాపై నమ్మకంతో థియేటర్ కు వచ్చే ఆడియన్స్ ఎట్టి పరిస్థితుల్లోనూ డిజప్పాయింట్ కారు అని ఖచ్చితంగా చెప్పగలను’ అని తెలిపింది. బిగ్ బాస్ బ్యూటీ వాసంతి చెబుతూ, ఈ చిత్రంలో నేను ఓ కీలకమైన పాత్రలో నటించాను. ఈ అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతలకు థ్యాంక్స్` అని చెప్పింది.
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ కుమార్ మాట్లాడుతూ.. ‘ఈ సినిమాలో నటించిన వారిలో చాలామంది కొలీగ్స్, ఫ్రెండ్స్ ఉన్నారు. సినిమా చూసి ఆ ఎక్స పీరియన్స్ ను షేర్ చేసుకోవడం నా ప్రొఫెషన్ లో భాగం. సినిమా తీసే ఎక్స్ పీరియన్స్ ను నాకు అందించిన మొదటి సినిమా సిఎస్ఐ సనాతన్. అందుకే ఇది నాకు స్పెషల్ మూవీ కూడా. స్క్రిప్ట్ నుంచి పోస్ట్ ప్రొడక్షన్ వరకూ ప్రతి క్రాఫ్ట్ నూ పర్సనల్ గా ఎక్స్ పీరియన్స్ చేసే అవకాశం నాకు వచ్చింది. ఈ అవకాశం నాకు ఇచ్చిన చాగంటి ప్రొడక్షన్స్ శాంతయ్యగారికి థ్యాంక్స్ చెబుతున్నాను. ఈ సినిమాతో మీరు ఓ కొత్త ఆది సాయికుమార్ ను చూడబోతున్నారు. ఇప్పటి వరకూ ఆయన చేసిన పాత్రలకు భిన్నంగా ఈ మూవీలో సినిమా అంతా ఒకే మూడ్ లో కనిపించబోతున్నారు. రీసెంట్ గా పులి మేక సిరీస్ తో పెద్ద విజయం అందుకున్న ఆది గారికి ఈ మూవీ మరో పెద్ద విజయం ఇస్తుందనుకుంటున్నారు. చాలా సీరియస్ రోల్ ను మరింత ఇంటెన్సిటీతో చేశారు. ఈ మూవీతో కొత్త ఫేజ్ స్టార్ట్ అవుతుందని కోరుకుంటూ ఆల్ ద బెస్ట్ టూ ఎంటైర్ టీమ్..’ అన్నారు.
నటీనటులు - ఆదిసాయికుమార్, మిషా నారంగ్, అలీ రెజా, రోజా, నందిని రాయ్, తాకర్ పొన్నప్ప ,మధు సూదన్, వాసంతి తదితరులు.
సాంకేతిక వర్గం -
సినిమాటోగ్రఫీ: జి. శేఖర్
మ్యూజిక్: అనీష్ సోలోమాన్
పిఆర్ఒ. జి.ఎస్.కె మీడియా
నిర్మాత: అజయ్ శ్రీనివాస్
దర్శకుడు: శివశంకర్ దేవ్