కృతి శెట్టిని గారం చేస్తున్న సుధీర్ బాబు, కొత్త పాటతో ఆకట్టుకుంటున్న జంట

By Mahesh JujjuriFirst Published Aug 24, 2022, 2:20 PM IST
Highlights

వరుస విజయాల అందాల భామ కృతి శెట్టి.. టాలీవుడ్ హ్యాండ్సమ్ హీరో సుధీర్ బాబు కలిసి నటిస్తున్న సినిమా ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి. ఈ మూవీ నుంచి రొమాంటిక్ సాంగ్ ఒకటి రిలీజ్ అయ్యింది. 
 

వరుస విజయాల అందాల భామ కృతి శెట్టి.. టాలీవుడ్ హ్యాండ్సమ్ హీరో సుధీర్ బాబు కలిసి నటిస్తున్న సినిమా ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి. ఈ మూవీ నుంచి రొమాంటిక్ సాంగ్ ఒకటి రిలీజ్ అయ్యింది. 

మోహనకృష్ణ ఇంద్రగంటి  డైరెక్షన్ లో ఇప్పటికే రెండు సినిమాలు చేశాడు సుధీర్ బాబు. ఇక ఇప్పుడు ముచ్చటగా మూడో సినిమా చేస్తున్నాడు. మంచి ఫీల్ ఉన్న కథతో.. తెరెక్కుతోన్న ఈసినిమా ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి. తనకు తగిన కథలను ఎంచుకుంటూ.. నిదానంగా సినిమాలు చేసుకుంటూ పోతున్నాడు సుధీర్ బాబు.. ఇక  తాజాగా ఈ సినిమా నుంచి ఒక వీడియో సాంగును రిలీజ్ చేశారు టీమ్. అల్లంత దూరాన నువ్వు నీ కళ్లు నన్నే చూస్తుంటే ఏం చేయాలో, రవ్వంత గారంగ నాలోని నన్ను మాటాడిస్తుంటే ఏం చెప్పాలో అంటూ... సాగే పాటు ఆడియన్స్ ను ఆకట్టుకుంటుంది. 

 

వివేక్ సాగర్ స్వరపరిచిన ఈ పాటకి రామజోగయ్య శాస్త్రి సాహిత్యాన్ని అందించాడు. ట్యూన్ .. సాహిత్యం రెండూ కూడా మనసుకు పట్టుకునేలా ఉన్నాయి. ఈ పాట ఈ ఆల్బమ్ కి హైలైట్ గా నిలిచే  అవకాశం ఉంది. వెన్నెల కిశోర్ .. అవసరాల శ్రీనివాస్, రాహుల్ రామకృష్ణ  ముఖ్యమైన పాత్రలను పోషించిన ఈ సినిమా, సెప్టెంబర్ 16వ తేదీన విడుదల కానుంది. ఈ సందర్భంగా ప్రమోషన్స్ ను షురూ చేశారు టీమ్. 

మైత్రీ మూవీ మేకర్స్ - బెంచ్ మార్క్ స్టూడియోస్ వారు ఈ సినిమాను నిర్మించారు. ఈ సినిమా షూటింగ్ అయిపోయి చాలా కాలం అవుతుంది. కాని కరోనాతోపాటు..కొన్ని కొన్ని ఇతర కారణాల వల్ల సినిమా రిలీజ్ కు లేట్ అయ్యింది. ఇక ఈమూవీ రిలీజ్ కు ముస్తాబు అవుతుంది. ఇప్పటి వరకూ ..సరైన విడుదల తేదీ కోసం వెయిట్ చేస్తూ వచ్చింది. 

click me!