2.0 టార్గెట్ ఫిక్స్.. ప్రమోషన్స్ అదిరిపోవాలట!

By Prashanth MFirst Published Oct 20, 2018, 11:05 AM IST
Highlights

ఇండియాలోనే అత్యధిక భారీ బడ్జెత్ తో తెరకెక్కిన 2.0 చిత్రం విడుదలపై అంచనాలు ఏ విధంగా ఉన్నాయో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో రజినీకాంత్ - అక్షయ్ కుమార్ కుమార్ నటించారు.

ఇండియాలోనే అత్యధిక భారీ బడ్జెత్ తో తెరకెక్కిన 2.0 చిత్రం విడుదలపై అంచనాలు ఏ విధంగా ఉన్నాయో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో రజినీకాంత్ - అక్షయ్ కుమార్ కుమార్ నటించారు. టీజర్ ని ఇటీవల రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. అయితే దానికి పెద్దగా రెస్పాన్స్ రాలేదు. భిన్నాభిప్రాయాలు వెలువడ్డాయి. 

దీంతో చిత్ర యూనిట్ ఇప్పుడు ప్రమోషన్స్ పై టార్గెట్ చేసింది. 500 కోట్ల సినిమాకు సరిపడా పబ్లిసిటి చెయ్యాలని ఫిక్స్ అయ్యారు. సాధారణంగా శంకర్ సినిమాలకు ఫస్ట్ లుక్ అండ్ మ్యూజిక్ తోనే క్రేజ్ వస్తుంది. కానీ ఈ సారి ఆ ఫార్మాట్ పెద్దగా కలిసిరాలేదు. దీంతో జనాల్లోకి సినిమాను ఎలాగైనా తీసుకెళ్లాలని ఇప్పటినుంచి చేసే ప్రమోషన్స్ అదిరిపోవాలని ఫిక్స్ అయ్యారు. 

ముందుగా లిరికల్ సాంగ్స్ ను రిలీజ్ చేయనున్నారు. శనివారం ఉదయం 11గంటలకు మొదటి లిరికల్ సాంగ్ రిలీజ్ చేశారు. రెహమాన్ సంగీతం అందించిన సంగతి తెలిసిందే. ఇకపోతే నెక్స్ట్ ట్రైలర్ లంచ్ ఈవెంట్ ను కూడా భారీగా ప్లాన్ చేస్తున్నారు. తెలుగులో కూడా ప్రమోషన్స్ డోస్ ను పెంచనున్నారు. దీపావళికి సినిమా విడుదల కానుంది. 

 

 

                                                                          

click me!