సురేష్ బాబు, నిశ్శబ్దం నిర్మాత విశ్వప్రసాద్ కలిసి వెంకీ మామ చిత్రం నిర్మించారు. దాంతో నిశ్శబ్దం సైతం సురేష్ ప్రొడక్షన్స్ ద్వారా రిలీజ్ చేస్తున్నారు. అయితే బిజినెస్ లెక్కలు తెలిసిన సురేష్ బాబు...ప్రీ రిలీజ్ బిజినెస్ మొత్తం క్లోజ్ అయితే కానీ సినిమా రిలీజ్ కు పెట్టరు.
‘భాగమతి’ చిత్రం తర్వాత అనుష్క నటిస్తున్న తాజా చిత్రం ‘నిశ్శబ్దం’. హేమంత్ మధుకర్ దర్శకత్వం లో రూపొందిన ఈ చిత్రంలో మాధవన్, అంజలి, మైఖేల్ మ్యాడసన్, షాలినీ పాండే, సుబ్బరాజు, శ్రీనివాస్ అవసరాల ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, కోన ఫిల్మ్ కార్పోరేషన్ పతాకాలపై టి.జి. విశ్వప్రసాద్, కోన వెంకట్ నిర్మిస్తున్న ఈ సినిమా జనవరి 31 న రిలీజ్ కానుందని గతంలో ప్రకటించారు. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా విడుదల వాయిదా పడిందని తెలుస్తోంది. అయితే అందుకు కారణం ప్రముఖ నిర్మాత సురేష్ బాబు అని తెలుస్తోంది.
సురేష్ బాబు, నిశ్శబ్దం నిర్మాత విశ్వప్రసాద్ కలిసి వెంకీ మామ చిత్రం నిర్మించారు. దాంతో నిశ్శబ్దం సైతం సురేష్ ప్రొడక్షన్స్ ద్వారా రిలీజ్ చేస్తున్నారు. అయితే బిజినెస్ లెక్కలు తెలిసిన సురేష్ బాబు...ప్రీ రిలీజ్ బిజినెస్ మొత్తం క్లోజ్ అయితే కానీ సినిమా రిలీజ్ కు పెట్టరు. అలాగే సీజన్, అన్ సీజన్, ఎప్పుడు సినిమాలు ఆడతాయో తన అనుభవంతో తెలుసు.
అనుష్క 'నిశ్శబ్దం' రిలీజ్ డేట్ వాయిదా.. కారణమేంటంటే..?
దాంతో ఈ సినిమాకు మిగతా భాషల్లో బిజినెస్ కాలేదని, అది ఫినిష్ చేసుకోమని సూచించారట. అలాగే పిబ్రవరి నెలలో జనం సినిమాలు చూడటానికి ఉత్సాహం చూపించరని, శివరాత్రి తర్వాతే సినిమాలు రిలీజ్ పెట్టుకోవాలని చెప్పారట. దాంతో నిశ్శబ్దాన్ని ..సైలెంట్ గా వాయిదా వేసారట.
ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో వుంది. ఇందులో సాక్షి అనే మూగ చిత్రకారిణిగా అనుష్క నటిస్తున్నారు. ‘నిశ్శబ్దం’ సినిమాలోని పాత్ర కోసం నాలుగు నెలలు కష్టపడి సైన్ లాంగ్వేజ్, పెయింటింగ్ నేర్చుకుంది అని దర్శకుడు హేమంత్ మధుకర్ పేర్కొన్నారు.
ప్రముఖ నిర్మాణ సంస్థలు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, కోన ఫిల్మ్ కార్పోరేషన్ బ్యానర్స్పై టీజీ విశ్వప్రసాద్, కోన వెంకట్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మాధవన్, అంజలి, షాలినీపాండే, సుబ్బరాజు కీలకపాత్రలు పోషిస్తున్నారు. తెలుగు, తమిళ, మలయాళ, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో రూపొందొంది.