అతడిపై అనుమానం.. పోలీస్ స్టేషన్ కి వెళ్లిన శ్రీరెడ్డి!

By AN TeluguFirst Published Jan 2, 2020, 4:49 PM IST
Highlights

ఇటీవల తన ఫేస్ బుక్ ఖాతాలో తాను ఉంటున్న ఇంటి సమీపంలో నటి తమన్నా నటిస్తోన్న వెబ్ సిరీస్ షూటింగ్ జరుగుతోందని.. ఆ యూనిట్ సభ్యులంతా గోల చేస్తున్నారని.. తమన్నా బాడీ గార్డ్స్ తనను విసిగిస్తున్నారని చెప్పుకొచ్చింది. 

వివాదాస్పద నటి శ్రీరెడ్డి టాలీవుడ్, కోలీవుడ్ కి సంబంధించిన ప్రముఖులపై మీటూ ఆరోపణలు చేసి సంచలనం సృష్టించింది. ఆమెకి తెలుగులో అవకాశాలు లేకపోవడంతో చెన్నైకి షిఫ్ట్ అయింది. ప్రస్తుతం వలసరవాక్కం, అన్భునగర్ లో ఒక ఫ్లాట్ లో నివసిస్తోంది.

కాగా ఇటీవల తన ఫేస్ బుక్ ఖాతాలో తాను ఉంటున్న ఇంటి సమీపంలో నటి తమన్నా నటిస్తోన్న వెబ్ సిరీస్ షూటింగ్ జరుగుతోందని.. ఆ యూనిట్ సభ్యులంతా గోల చేస్తున్నారని.. తమన్నా బాడీ గార్డ్స్ తనను విసిగిస్తున్నారని చెప్పుకొచ్చింది. ఇది ఇలా ఉండగా.. రెండు రోజుల క్రితం నటి శ్రీరెడ్డి స్థానిక కోయంబేడు పోలీస్ స్టేషన్ లో ఈ విషయమై ఫిర్యాదు చేశారు.

చిరు వెర్సస్ రాజశేఖర్ : గొడవల చరిత్ర ఇదీ!

ఆ కంప్లైంట్ లో తాను ఉంటున్న ఇంటి సమీపంలో విశ్రాంతి పోలీస్ అధికారి బంగ్లా ఉందని.. అందులో గత కొన్ని రోజులుగా సినిమా షూటింగ్ జరుగుతోందని తెలిపారు. దీంతో ఆ ప్రాంతంలో పలు కార్లను నిలుపుతున్నారని చెప్పారు. తాను సోమవారం నాడు బయటకి వెళ్లి రాత్రి తిరిగి ఇంటికి రాగా తన ఇంటి ముందు ఒక వాహనం నిలిపి ఉండడంతో దాన్ని బయట పెట్టినట్లు చెప్పారు.

ఆ తరువాత కొంచెం సేపటికి వచ్చి చూస్తే తన ఖరీదైన ఆడి కారుకి గీతలు గీసి ధ్వంసం చేసి ఉండటం చూసినట్లు చెప్పారు. షూటింగ్ చేస్తోన్న చిత్ర కార్యనిర్వాహకుడు మనోజ్ పై అనుమానం ఉందని పేర్కొన్నారు. సంఘటనపై విచారణ జరిపి సంబంధిత వ్యక్తులపై తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. దీంతో కేసుని నమోదు చేసుకున్న పోలీసులు విచారణ జరుగుతున్నారు. ఆ ప్రాంతంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల ఫుటేజ్ ని పరిశీలిస్తున్నారు.  

click me!