బాలయ్య వద్దు...పవన్ ముద్దు అంటోంది

By tirumala ANFirst Published Jan 29, 2020, 7:57 AM IST
Highlights

సోనాక్షి సిన్హా కెరీర్ బాలీవుడ్ లో దాదాపు ఎండింగ్ కు వచ్చేసింది. యంగ్ హీరోలెవరూ ఆమెను తమ సరసన తీసుకోవటం లేదు. సీనియర్ హీరోలకు అంత సీన్ ఉండటం లేదు. ఆమె ఎంతో ఎక్సపెక్టేషన్స్ పెట్టుకుని సల్మాన్ సరసన దబాంగ్ 3 డిజాస్టర్ అవటం ఆమెను నిరాశలో ముంచేసింది. 

సోనాక్షి సిన్హా కెరీర్ బాలీవుడ్ లో దాదాపు ఎండింగ్ కు వచ్చేసింది. యంగ్ హీరోలెవరూ ఆమెను తమ సరసన తీసుకోవటం లేదు. సీనియర్ హీరోలకు అంత సీన్ ఉండటం లేదు. ఆమె ఎంతో ఎక్సపెక్టేషన్స్ పెట్టుకుని సల్మాన్ సరసన దబాంగ్ 3 డిజాస్టర్ అవటం ఆమెను నిరాశలో ముంచేసింది. బాలీవుడ్ తలుపులు దాదాపు మూసుకుపోయాయని అర్దమైంది. ఈ నేపధ్యంలో ఆమె దృష్టి దక్షిణాదిపై పడింది. అప్పట్లో రజనీకాంత్ చిత్రం లింగా లో కనిపించిన ఆమె ఆ తర్వాత మళ్లీ ఇక్కడ అడుగు పెట్టలేదు. అయితే ఇప్పుడు ఆమె తెలుగులో చేయటానికి ఉత్సాహం చూపిస్తోంది.

దాంతో బాలకృష్ణ,బోయపాటి కాంబినేషన్ చిత్రం కోసం ఆమెను హీరోయిన్ గా అడగటం జరిగిందని సమాచారం. అయితే రెమ్యునేషన్ సమస్యతో ఆమె ఈ ప్రాజెక్టుని వద్దనుకుందని సమాచారం. అయితే అదే సమయంలో క్రిష్, పవన్ కళ్యాణ్ కాంబో లో రూపొందనున్న చిత్రానికి ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు చెప్తున్నారు. ఈ మేరకు చర్చలు జరుగుతున్నట్లు చెప్తున్నారు. సోనాక్షి కనుక ఈ ప్రాజెక్టు సైన్ చేస్తే ఇదే తెలుగులో ఆమె తొలి చిత్రం అవుతుంది. పీరియడ్ డ్రామాగా రూపొందే ఆ చిత్రంలో ఆమె పాత్ర ఓ ప్రత్యేకతను కలిగి ఉంటుందని చెప్తున్నారు.

రాజమౌళి సినిమాలో శ్రీయ.. ఆమె రోల్ ఇదేనా?

ఇక సల్మాన్ చేసిన దబంగ్ సినిమాతో హిందీ సినిమా ప్రేక్షకులకు పరిచయమైంది బ్యూటీ సోనాక్షి సిన్హా. ఆ సినిమా బ్లాక్ బస్టర్ కావడంతో ఓవర్ నైట్ సూపర్ స్టార్ అయిపోయింది. ఆ తర్వాత కూడా ఈమె సినిమాలో ఉంటే  హిట్ అనే సెంటిమెంట్ తో నడిచిపోయింది. కాని అనుకున్నట్లుగా ఆమె కెరీర్ సాగలేదు. వరస డిజాస్టర్స్ ఆమెను దెబ్బకొట్టాయి. స్టార్స్ సరసన ఆఫర్స్ రాకపోవటంతో  అందాల ఆరబోతలో కూడా హద్దులు దాటేస్తూ..హాట్ ఫోటోషూట్ చేసింది ఈ ముద్దుగుమ్మ. అయినా పెద్దగా ఫలితం కనపడలేదు.

click me!