కలియుగంలో కనిపించే సీత.. చెల్లెళ్ళతో ఫోటో, ఇంటర్నెట్ లో వైరల్!

By tirumala ANFirst Published Apr 17, 2020, 10:30 AM IST
Highlights

80వ దశకంలో బుల్లితెరపై ప్రసారం అయిన రామాయణం టివి సిరీస్ ఒక చరిత్రాత్మకం. ప్రముఖ దర్శకుడు రామానంద్ సాగర్ సృష్టించిన అద్భుత దృశ్యకావ్యం రామాయణం.

80వ దశకంలో బుల్లితెరపై ప్రసారం అయిన రామాయణం టివి సిరీస్ ఒక చరిత్రాత్మకం. ప్రముఖ దర్శకుడు రామానంద్ సాగర్ సృష్టించిన అద్భుత దృశ్యకావ్యం రామాయణం. 80 వ దశకంలో ఈ టివి సిరీస్ దూరదర్శన్ లో ప్రసారం అయింది. 

ఈ టివి సిరీస్ లో ప్రతి పాత్ర అద్భుతమే. ఐఎండిబిలో ఈ టివి సిరీస్ కి 9.3 రేటింగ్ కనిపిస్తుంది. అంతలా ఈ టివి సిరీస్ ఖ్యాతి దక్కించుకుంది. ఈ టివి సిరీస్ లో ప్రముఖ నటి దీపికా చిక్లియా సీత పాత్రలో నటించారు. కలియుగంలో కనిపించే సీత ఈమే అంటూ అభిమానులు ప్రశంసించే స్థాయిలో ఆమె ఈ పాత్ర ద్వారా గుర్తింపు పొందారు. 

రజనీ కన్నా సుడిగాలి సుధీర్ కే ఎక్కువ క్రేజ్,ప్రూవైంది

లాక్ డౌన్ కారణంగా తిరిగి రామాయణం టివి సిరీస్ ని ప్రసారం చేస్తున్నారు. ఈ సంధర్భంగా రామాయణం టీం అప్పటి అనుభవాలని నెమరు వేసుకుంటున్నారు. దీపికా తాజాగా తన సోషల్ మీడియాలో ఓ మెమొరబుల్ పిక్ ని అభిమానులతో పంచుకున్నారు. సీతా దేవి పాత్రలో ఉన్న దీపికా తన ఆన్ స్క్రీన్ చెల్లెళ్ళతో వెళిపోతున్న ఫోటోని పంచుకున్నారు. 

ఈ పిక్ ఇంటర్నెట్ లో వైరల్ గా మారింది. సితాజి విత్ హర్ సిస్టర్స్ అనే హ్యాష్ ట్యాగ్ ని జోడించింది. ఆ మధ్యన దీపికా కపిల్ శర్మ షోకి హాజరైనప్పుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఎవరైనా సెలెబ్రిటీలు కనిపించగానే అభిమానులు హాయ్, హలో సర్, మేడం అని పలకరిస్తారు. కానీ నేను కనిపించగానే రెండుచేతులు జోడించి నమస్కరిస్తారు అని  దీపికా తెలిపారు. 

click me!