శర్వా తాజాగా నటిస్తోన్న మరో సినిమా 'శ్రీకారం'. ఈ చిత్రంతో కిశోర్ రెడ్డి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ చిత్రానికి కథ, స్క్రీన్ప్లేను కిశోర్ రెడ్డి అందించగా.. సాయిమాధవ్ బుర్రా డైలాగ్స్ రాస్తున్నారు.
హీరో శర్వానంద్ ప్రస్తుతం సినిమాలతో బిజీగా గడుపుతున్నారు. తమిళ సినిమా '96'కి రీమేక్ 'జాను' సినిమాలో నటిస్తున్నారు. సమంత హీరోయిన్ గా నటించిన ఈ సినిమా మరికొద్ది రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఇది ఇలా ఉండగా.. శర్వా తాజాగా నటిస్తోన్న మరో సినిమా 'శ్రీకారం'. ఈ చిత్రంతో కిశోర్ రెడ్డి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ చిత్రానికి కథ, స్క్రీన్ప్లేను కిశోర్ రెడ్డి అందించగా.. సాయిమాధవ్ బుర్రా డైలాగ్స్ రాస్తున్నారు.
హ్యాట్రిక్ పై కన్నేసిన శర్వా.. 2020లో డిఫరెంట్ ప్రాజెక్ట్స్?
మిక్కి జె.మేయర్ సంగీత సారథ్యం వహిస్తున్నారు. యువరాజ్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. 14 రీల్స్ ప్లస్ బ్యానర్పై తెరకెక్కుతోన్న ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల చేయాలని భావిస్తున్నారు. శర్వానంద్ 29వ చిత్రంగా రూపొందుతోన్న ఈ సినిమా ఫస్ట్ లుక్ ని తాజాగా ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు.
''ఇతను మన కేశవుల కొడుకు.. పొద్దున్నే పొలం పనికి వెళ్తున్నాడు చూడండి'' అంటూ చిత్రబృందం శర్వా ఫస్ట్ లుక్ ని విడుదల చేసింది. పోస్టర్ ని బట్టి సినిమాలో శర్వా రైతు పాత్రలో కనిపించనున్నాడని తెలుస్తోంది. ఇందులో హీరోయిన్ గా ప్రియాంక మోహన్ కనిపించనుంది.
Hear It Is The First Look Of ♥️♥️ https://t.co/eHBmrH3HUt
— Sharwanand (@ActorSharwanand)