అమ్మాయిలపై అత్యాచారం, హత్య.. సైకోపై హీరోయిన్ యుద్ధం!

By tirumala ANFirst Published Dec 10, 2019, 4:28 PM IST
Highlights

క్రైమ్ నేపథ్యంలో వచ్చే సైకో థ్రిల్లర్ చిత్రాలకు మంచి ఆదరణ ఉంటుంది. బాలీవుడ్ నటి రాణి ముఖర్జీ నటిస్తున్న తాజా చిత్రం 'మర్దానీ 2'.

క్రైమ్ నేపథ్యంలో వచ్చే సైకో థ్రిల్లర్ చిత్రాలకు మంచి ఆదరణ ఉంటుంది. బాలీవుడ్ నటి రాణి ముఖర్జీ నటిస్తున్న తాజా చిత్రం 'మర్దానీ 2'. గోపి పుత్రన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం డిసెంబర్ 13న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. 

ప్రస్తుతం దేశంలో సంచలనంగా మారిన అమ్మాయిలపై అత్యాచారం, హత్య సంఘటనల ఆధారంగానే ఈ చిత్రం తెరకెక్కుతోంది. రాజస్థాన్ లోని కోట ప్రాంతానికి ఉద్యోగ శిక్షణ కోసం ప్రతి ఏటా వేలాదిమంది అమ్మాయిలు వస్తుంటారు. వారిపై కన్నేసిన ఓ సైకో అత్యాచారం చేసి హత్య చేస్తుంటాడు. వాడి అంతు చూడడానికి పోలీస్ అధికారి శివానీగా రాణి ముఖర్జీ రంగంలోకి దిగుతుంది. 

ఆ సైకోని చివరకు ఎలా తుదముట్టించింది అనేది ఈ చిత్ర కథ. ఆ మధ్యన విడుదలైన ట్రైలర్ కు విశేషమైన స్పందన లభించింది. ఈ చిత్రాన్ని సౌత్ ఇండియాలో కూడా ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ తో రిలీజ్ చేస్తున్నట్లు తాజాగా చిత్ర యూనిట్ ప్రకటించింది. 

తండ్రయిన స్టార్ కమెడియన్.. సెలెబ్రిటీల శుభాకాంక్షల వెల్లువ!

యష్ రాజ్ ఫిలిమ్స్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని ఆదిత్య చోప్రా నిర్మిస్తున్నారు. ఈ చిత్ర షూటింగ్ ఎక్కువ భాగం నార్త్ ఇండియాలో జరిగింది. ఈ చిత్రంలోని సందేశం దేశం మొత్తం ఆడియన్స్ కు నచ్చే అవకాశం ఉందని, అందుకే సౌత్ ఇండియాలో కూడా రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. 

రాణి ముఖర్జీ కెరీర్ లో ఈ చిత్రం ఓ మైలు రాయిగా నిలిచిపోతుందని అంటున్నారు. పోలీస్ ఆఫీసర్ గా ఈ చిత్రంలో రాణి ముఖర్జీ పవర్ ఫుల్ లుక్ లో కనిపిస్తోంది. 

click me!